Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎనిమిదేళ్ల తర్వాత తన భర్త "స్త్రీ" అని గుర్తించిన భార్య

Webdunia
శుక్రవారం, 16 సెప్టెంబరు 2022 (12:25 IST)
కట్టుకున్న భర్తతో ఎనిమిది సంవత్సరాల పాటు కాపురం చేసిన తర్వాత ఆయన ఒక స్త్రీ అనే విషయాన్ని ఆలస్యంగా గుర్తించింది. గత 2014లో విజయ్ వర్థన్‌ అనే వ్యక్తిని పెళ్ళి చేసుకున్న మహిళ... సంవత్సరాలు గడిచిపోతున్నా తనతో సన్నిహితంగా మెలగడం లేదు. దీంతో ఆమెకు అనుమానం వచ్చి ఆరా తీస్తే ప్రమాదం జరిగిందని నమ్మబలికే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత కోల్‌కతాకు వెళ్లి లింగ మార్పిడి చికిత్స చేయించుకున్నారు. చివరకు ఆ విషయం వెలుగులోకి వచ్చింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, వడోదరకు చెందిన 40 యేళ్ల మహిళ గత 2014లో విజయ్ వర్థన్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. గతంలో విజేత అనే యువతిగా ఉన్న విజయ్ వర్థన్‌తో ఓ మాట్రిమోనియల్‌ సైట్ ద్వారా బాధిత మహిళకు పరిచయం ఏర్పడింది. బాధిత మహిళ తన భర్త 2011లో ఓ రోడ్డు ప్రమాదంలో మరణించాడు. వీరికి 14 యేళ్ల కుమార్తె ఉంది. ఆ తర్వాత ఆమె 2014లో విజయ్ వర్థన్ అనే వ్యక్తిని రెండో వివాహం చేసుకుంది.
 
ఆ తర్వాత వారిద్దరూ హనీమూన్ కోసం కాశ్మీర్ వెళ్ళగా భార్యతో ఆయన సన్నిహితంగా ఉండలేక పోయారు. ప్రతిసారీ ఇదేవిధంగా చేస్తుండటంతో ఆమెకు అనుమానం వచ్చింది. అయినప్పటికీ పలు కుంటి సాకులు చెబుతూ తప్పించుకుంటూ వచ్చాడు. తాను రష్యాలో ఉన్న సమయంలో ప్రమాదం జరిగిందని, అప్పటి నుంచి శృంగారానకి పనికిరాకుండా పోయానని చెప్పాడు. ఆ తర్వాత జరిగిన చిన్నపాటి సర్జరీ తర్వాత అంతా సర్దుకుందని నమ్మబలికాడు. 
 
ఈ క్రమంలో గత 2020లో బరువు తగ్గించుకోవాలన్న సాకుతో కోల్‌కతాకు వెళ్లి ఆపరేషన్ చేయించుకున్నాడు. అక్కడ నుంచి వచ్చాక అసలు నిజం చెప్పాడు. లింగమార్పిడి చికిత్స చేయించుకుని పురుషుడుగా మారినట్టు చెప్పాడు. అంతకు మించి తనకేంమీ చెప్పలేదనీ ఆమె పోలీసులక ఓ ఫిర్యాదు ఇచ్చింది. పైగా, ఆయన తనతో అసహజ శృంగారం చేసేవాడనీ తన విషయం ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందంటూ హెచ్చరించాడు. దీంతో కేసు నమోదు చేసే విచారణ చేపట్టిన పోలీసులు.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Veera Dheera Sooran: చియాన్ విక్రమ్ వీర ధీర సూరన్ పార్ట్ 2 - మార్చి 27 గ్రాండ్ రిలీజ్

Janhvi Kapoor : RC16 లో టెర్రిఫిక్ రోల్ చేస్తున్న జాన్వి కపూర్ !

ఉపవాసం దీక్ష తో మూకుత్తి అమ్మన్ 2 చిత్ర పూజకు హాజరైన నయనతార

మ్యారేజ్ అంటే ఒప్పందం, సెటిల్మెంట్ కాదని చెప్పే చిత్రం మిస్టర్ రెడ్డి

Divya Bharathi: యాక్షన్ సీన్స్ చేయడం కష్టం, ఇలాంటి సినిమా మళ్ళీ రాదు : దివ్యభారతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నడుస్తున్నప్పుడు ఇలాంటి సమస్యలుంటే మధుమేహం కావచ్చు

మహిళలు బెల్లం ఎందుకు తినాలో తెలుసా?

మహిళలు ప్రతిరోజూ ఆపిల్ కాదు.. ఆరెంజ్ పండు తీసుకుంటే.. ఏంటి లాభమో తెలుసా?

Hibiscus Flower: మహిళలకు మెరిసే అందం కోసం మందార పువ్వు

పుచ్చకాయ ముక్కను ఫ్రిడ్జిలో పెట్టి తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments