ఆటో డ్రైవర్ భర్త శవం కోసం పోటీపడిన ఏడుగురు భార్యలు.. ఎక్కడ?

Webdunia
గురువారం, 3 అక్టోబరు 2019 (16:00 IST)
ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హరిద్వార్‌లో విచిత్ర సంఘటన ఒకటి జరిగింది. చనిపోయిన ఆటో డ్రైవర్ భర్త కోసం ఏడుగురు భార్యలు పోటీపడిన ఘటన ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ ఊహించని పరిణామంతో ఏం చేయాలో తెలియక పోలీసులే బిక్కమొహాలు వేశారు.
 
ఈ వివరాలను పరిశీలిస్తే, హరిద్వార్‌లోని రవిదాస్ బస్తీకి చెందిన పవన్ కుమార్ అనే 40 ఏళ్ల వ్యక్తి డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక ఆదివారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న అతన్ని ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మరణించినట్టు వైద్యులు ధ్రువీకరించారు. ఇక్కడే అసలు కథ మొదలైంది.
 
అతని మృతదేహాన్ని ఇంటికి తరలించగా.. భార్య తీవ్ర దుఃఖంలో మునిగిపోయింది. అంతలో మరో ఆరుగురు మహిళలు ఒకరి తర్వాత ఒకరు అక్కడికి వచ్చారు. 'మా ఆయన అంటే మా ఆయన' అంటూ పెద్దగా ఏడవడం మొదలుపెట్టారు. మృతదేహం తమకంటే తమకు అప్పగించాలంటూ గొడవకు దిగారు. అక్కడున్న వారికి ఏమీ అర్థంకాక అలా చూస్తుండిపోయారు. 
 
ఇష్టమొచ్చినట్టు తిట్టుకుంటున్న వారు.. పోలీసుల ఎంట్రీతో కాస్త తగ్గారు. వారందరినీ ఎలాగోలా శాంతపరిచాక.. అతని అంత్యక్రియలు నిర్వహించారు. అయితే ఈ గొడవపై అప్పుడే ఏమీ తేల్చలేమని.. మరికొద్ది రోజులు ఆగాక.. మృతుడి భార్యలపై ఒక అవగాహన వస్తుందని పోలీసులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Aishwarya Rajesh: తిరువీర్, ఐశ్వర్య రాజేష్ టైటిల్ ఓ..! సుకుమారి

రామానాయుడు స్టూడియోస్‌లో 20 కోట్ల సెట్ లో నాగబంధం క్లైమాక్స్

Monalisa: కుంభమేళా ఫేమ్ మోనాలిసా లైఫ్ సినిమా షూటింగ్ పూర్తి

Pothana Hema: దుఃఖాన్ని బలంగా మార్చుకుని ముందుకుసాగుతున్న పోతన హేమ

Richard Rishi: ద్రౌప‌ది 2 నుంచి నెల‌రాజె... మెలోడీ సాంగ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments