Webdunia - Bharat's app for daily news and videos

Install App

అదుపు తప్పి బీభత్సం సృష్టించిన ఎలక్ట్రిక్ బస్సు - ఐదుగురి మృతి

Webdunia
సోమవారం, 31 జనవరి 2022 (08:58 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్‌లో ఓ ఎలక్ట్రిక్ బస్సు బీభత్సం సృష్టించింది. అదుపుతప్పి మూడు కార్లు, పలు మోటార్ సైకిళ్లను ఢీకొట్టింది. అంతటితో ఆగని ఈ బస్సు పాదాచారులపైకి కూడా దూసుకెళ్లింది. దీంతో ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది గాయపడ్డారు. బీభత్సం సృష్టించిన బస్సు చివరకు ఓ లారీని ఢీకొని ఆగింది. 
 
ఈ బస్సు బీభత్స సమాచారం వార్త అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మరోవైపు, ఈ బీభత్సానికి కారణమైన బస్సు డ్రైవర్ పరారీలో ఉన్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన కాన్పూరు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments