Webdunia - Bharat's app for daily news and videos

Install App

అస్సాం-మేఘాలయ సరిహద్దుల్లో మళ్లీ ఉద్రిక్తత - కాల్పుల్లో ఆరుగురి మృతి

Webdunia
బుధవారం, 23 నవంబరు 2022 (09:07 IST)
అస్సాం - మేఘాలయ రాష్ట్రా మధ్య మళ్లీ ఉద్రిక్తలు చెలరేగాయి. రెండు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లో జరిగిన కాల్పుల్లో ఓ ఫారెస్ట్ గార్డుతో సహా ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మేఘాలయ వెస్ట్ జైంటియా హిల్స్‌లోని ముక్కో గ్రామంలో ఈ కాల్పుల ఘటన జరిగింది. కలప స్మగ్లింగ్‌ను అస్సాం అటవీ శాఖ అధికారులు అడ్డుకోవడమే దీనికి కారణం. 
 
కాల్పుల్లో అస్సాం ఫారెస్ట్ గార్డుతో సహా ఐదుగురు మేఘాలయా వాసులు చనిపోయారు. ఈ ఘటనపై మేఘాలయ ముఖ్యమంత్రి విచారణకు ఆదేశించగా, అల్లర్లు ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా ఉండేందుకు వీలుగా ఏడు జిల్లాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. 
 
మంగళవారం ఏడు గంటల ప్రాంతంలో కలపను స్మగ్లింగ్ చేస్తున్న ట్రక్కును అస్సాం అటవీ శాఖ అధికారులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో స్మగ్లర్లు వాహనాని ఆపకపోగా మరింత వేగంగా పోనిచ్చారు. దీంతో అస్సాం ఫారెస్ట్ గార్డులు ఛేజ్ చేస్తూ కాల్పులు జరపడంతో ఆరుగు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఐదుగురు మేఘాలయ వాసులు, ఒక అస్సాం ఫారెస్ట్ గార్డు ఉన్నారు. 
 
ఈ ఘటనతో అప్రమత్తమైన ప్రభుత్వం అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఏడు జిల్లాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది. కాగా అస్సాం - మేఘాలయ మధ్య 884.9 కిలోమీటర్ల పొడవైన సరిహద్దు ప్రాంతం ఉంది. ఇందులో 12 వివాదాస్పద ప్రాంతాలు ఉన్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vijay: టాలెంట్ ఉందోలేదో తెలీదు, ఆ డైరెక్టర్ తో వంద దేవుళ్ళు చేస్తున్నా : విజయ్ ఆంటోనీ

హరికథ రిలీజ్ డేట్ పోస్టర్ విడుదల చేసిన మంత్రి వాకిటి శ్రీహరి

డ్రాగన్ కోసం బరువు తగ్గుతున్న ఎన్టీఆర్.. వర్కౌట్ వీడియో వైరల్

Sridevi: హర్ష్ రోషన్, శ్రీదేవి అపల్లా జంటగా బ్యాండ్ మేళం చిత్రం

Modi: ఇంగ్లీష్ లోనూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బయోపిక్ మా వందే ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లో సిగ్నేచర్ జ్యువెలరీ ఎగ్జిబిషన్‌ను నిర్వహిస్తున్న జోస్ అలుక్కాస్

కొత్తిమీర ఎందుకు వాడాలో తెలుసా?

వర్షాకాలంలో ఎలాంటి ఆహారం తినాలి? ఏవి తినకూడదు?

Mustard oil: ఆవనూనెతో ఆరోగ్యం మాత్రమే కాదు.. అందం కూడా..?

Coconut Milk: జుట్టు ఆరోగ్యానికి కొబ్బరి పాలు.. ఎలా వాడాలంటే?

తర్వాతి కథనం
Show comments