అస్సాం-మేఘాలయ సరిహద్దుల్లో మళ్లీ ఉద్రిక్తత - కాల్పుల్లో ఆరుగురి మృతి

Webdunia
బుధవారం, 23 నవంబరు 2022 (09:07 IST)
అస్సాం - మేఘాలయ రాష్ట్రా మధ్య మళ్లీ ఉద్రిక్తలు చెలరేగాయి. రెండు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లో జరిగిన కాల్పుల్లో ఓ ఫారెస్ట్ గార్డుతో సహా ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మేఘాలయ వెస్ట్ జైంటియా హిల్స్‌లోని ముక్కో గ్రామంలో ఈ కాల్పుల ఘటన జరిగింది. కలప స్మగ్లింగ్‌ను అస్సాం అటవీ శాఖ అధికారులు అడ్డుకోవడమే దీనికి కారణం. 
 
కాల్పుల్లో అస్సాం ఫారెస్ట్ గార్డుతో సహా ఐదుగురు మేఘాలయా వాసులు చనిపోయారు. ఈ ఘటనపై మేఘాలయ ముఖ్యమంత్రి విచారణకు ఆదేశించగా, అల్లర్లు ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా ఉండేందుకు వీలుగా ఏడు జిల్లాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. 
 
మంగళవారం ఏడు గంటల ప్రాంతంలో కలపను స్మగ్లింగ్ చేస్తున్న ట్రక్కును అస్సాం అటవీ శాఖ అధికారులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో స్మగ్లర్లు వాహనాని ఆపకపోగా మరింత వేగంగా పోనిచ్చారు. దీంతో అస్సాం ఫారెస్ట్ గార్డులు ఛేజ్ చేస్తూ కాల్పులు జరపడంతో ఆరుగు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఐదుగురు మేఘాలయ వాసులు, ఒక అస్సాం ఫారెస్ట్ గార్డు ఉన్నారు. 
 
ఈ ఘటనతో అప్రమత్తమైన ప్రభుత్వం అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఏడు జిల్లాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది. కాగా అస్సాం - మేఘాలయ మధ్య 884.9 కిలోమీటర్ల పొడవైన సరిహద్దు ప్రాంతం ఉంది. ఇందులో 12 వివాదాస్పద ప్రాంతాలు ఉన్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీదేవి అపల్లా, ఫెమినా జార్జ్, విజయ్ బుల్గానిన్ కాంబోలో ద్విభాషా చిత్రం

Rajamouli: రాజమౌళి, మహేష్ బాబు చిత్రం వారణాసి ఒక్క పార్ట్ నా?

అరుళ్ నిథి, మమతా మోహన్‌దాస్ ల మై డియర్ సిస్టర్

ఘంటసాల స్క్రిప్ట్ ఎంతో ఎమోషనల్‌గా ఉంటుంది : ఆదిత్య హాసన్

సంగీత్ శోభన్ హీరోగా పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వంలో సినిమా ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments