Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముంబై కుర్లాలో బస్సు బీభత్సం - ఆరుగురు మృతి - 49 మందికి గాయాలు (Video)

ఠాగూర్
మంగళవారం, 10 డిశెంబరు 2024 (11:15 IST)
ముంబై మహానగరంలోని కుర్లాలో ఓ బస్సు బీభత్సం సృష్టించింది. నియంత్రణ కోల్పోయిన బస్సు వాహనాలపైకి దూసుకెళ్లింది. అంతటితో ఆగని ఆ బస్సు అపార్టుమెంట్ గేట్లను ఢీకొట్టి సెల్లార్‌లోకి దూసుకెళ్లి ఆగింది. ఈ ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా, మరో 49 మంది తీవ్రంగా గాయపడ్డారు. సోమవారం రాత్రి జరిగిన ఈ బీభత్సానికి సంబంధించిన వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 
 
సోమవారం రాత్రి 10 గంటల సమయంలో బృహన్ ముంబై ఎలక్ట్రిక్ సప్లై అండ్ ట్రాన్స్‌పోర్టుకు చెందిన లోకల్ ఎలక్ట్రిక్ బస్సు కుర్లా స్టేషన్ నుంచి అంధేరికి బయలుదేరింది. ఈ బస్సు వేగంగా వెళుతు అదుపుతప్పడంతో ముందు వెళుతున్న ఓ రిక్షాను, మూడు కార్లను, బైకర్లతో పాటు రోడ్డుపై నడిచివెళుతున్న పాదాచారులను కూడా ఢీకొట్టింది. 
 
ఈ ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 49 మంది గాయపడ్డారు. వీరిని సమీపంలోని ఆస్పత్రికి తరలించగా, వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: గద్దర్ అవార్డ్ ఫంక్షన్ హిట్టా - ఫ్లాపా - ఏవరేజా? స్పెషల్ స్టోరీ

Raja sab: గత ఏడాది మా చిత్రాలు నిరాశపరిచాయి : టీజీ విశ్వప్రసాద్

Bengal Files: రాజకీయ వ్యవస్థను ప్రశ్నించిన ది బెంగాల్ ఫైల్స్ టీజర్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments