Webdunia - Bharat's app for daily news and videos

Install App

పైల్స్ చికిత్సకు ఆస్పత్రికి వచ్చిన మహిళ.. మత్తిచ్చి రేప్ చేసిన డాక్టర్

Webdunia
సోమవారం, 14 అక్టోబరు 2019 (14:25 IST)
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో దారుణం జరిగింది. పైల్స్ చికిత్స కోసం ఆస్పత్రికి వచ్చిన ఓ మహిళ రోగిపై వైద్యుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమెకు మత్తిచ్చి మరీ అత్యాచారం చేసి... దాన్ని వీడియో తీశాడు. ఈ దారుణం తాజాగా వెలుగులోకి వచ్చింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, ముంబైలోని జోగేశ్వరి ఈస్ట్ ప్రాంతానికి చెందిన ఓ మహిళ (27) పైల్స్ సమస్యతో బాధపడుతోంది. ఈ క్రమంలో చికిత్స కోసం అదే ప్రాంతంలో ఉన్న డాక్టర్ వంశరాజ్ ద్వివేది క్లినిక్‌కు వచ్చింది. ఆమెకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చి 45 నిమిషాల పాటు నిద్రపోవాలని ద్వివేది సూచించాడు. 
 
ఆ తర్వాత ఆమె మత్తులోకి జారుకుంది. అనంతరం ఆమెపై అత్యాచారం చేసి, దాన్ని వీడియో తీశాడు. ఆ తర్వాత ఆ వీడియోను బాధితురాలికి పంపి, తనతో శారీరక సంబంధం పెట్టుకోవాలని ద్వివేది ఒత్తిడి చేయసాగాడు. 
 
ఆమె నిరాకరించినప్పటికీ.. ఆ వైద్యుడు మాత్రం ఆమెను బెదిరించసాగాడు. ఈ క్రమంలో ఆ మహిళ ఓ యువకుడిని పెళ్లి చేసుకుంది. అయినప్పటికీ తనకు పడకసుఖం ఇవ్వాలంటూ బెదిరించాడు. దీంతో ఈ వేధింపులను తట్టుకోలేని ఆమె... జరిగిన విషయాన్ని బంధువులకు, భర్తకు చెప్పి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు... కామాంధ వైద్యుడుని అరెస్టు చేశారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments