Webdunia - Bharat's app for daily news and videos

Install App

పైల్స్ చికిత్సకు ఆస్పత్రికి వచ్చిన మహిళ.. మత్తిచ్చి రేప్ చేసిన డాక్టర్

Webdunia
సోమవారం, 14 అక్టోబరు 2019 (14:25 IST)
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో దారుణం జరిగింది. పైల్స్ చికిత్స కోసం ఆస్పత్రికి వచ్చిన ఓ మహిళ రోగిపై వైద్యుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమెకు మత్తిచ్చి మరీ అత్యాచారం చేసి... దాన్ని వీడియో తీశాడు. ఈ దారుణం తాజాగా వెలుగులోకి వచ్చింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, ముంబైలోని జోగేశ్వరి ఈస్ట్ ప్రాంతానికి చెందిన ఓ మహిళ (27) పైల్స్ సమస్యతో బాధపడుతోంది. ఈ క్రమంలో చికిత్స కోసం అదే ప్రాంతంలో ఉన్న డాక్టర్ వంశరాజ్ ద్వివేది క్లినిక్‌కు వచ్చింది. ఆమెకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చి 45 నిమిషాల పాటు నిద్రపోవాలని ద్వివేది సూచించాడు. 
 
ఆ తర్వాత ఆమె మత్తులోకి జారుకుంది. అనంతరం ఆమెపై అత్యాచారం చేసి, దాన్ని వీడియో తీశాడు. ఆ తర్వాత ఆ వీడియోను బాధితురాలికి పంపి, తనతో శారీరక సంబంధం పెట్టుకోవాలని ద్వివేది ఒత్తిడి చేయసాగాడు. 
 
ఆమె నిరాకరించినప్పటికీ.. ఆ వైద్యుడు మాత్రం ఆమెను బెదిరించసాగాడు. ఈ క్రమంలో ఆ మహిళ ఓ యువకుడిని పెళ్లి చేసుకుంది. అయినప్పటికీ తనకు పడకసుఖం ఇవ్వాలంటూ బెదిరించాడు. దీంతో ఈ వేధింపులను తట్టుకోలేని ఆమె... జరిగిన విషయాన్ని బంధువులకు, భర్తకు చెప్పి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు... కామాంధ వైద్యుడుని అరెస్టు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments