Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒకరినొకరు కాపాడేయత్నం... నీట మునిగి ఐదుగురు టీనేజర్లు మృతి

Children Drown
Webdunia
ఆదివారం, 14 మే 2023 (13:17 IST)
గుజరాత్ రాష్ట్రంలోని బోతాద్ జిల్లాలో ఓ విషాదకర ఘటన జరిగింది. నీట మునిగిన తమ స్నేహితుడిని రక్షించుకునే ప్రయత్నంలో ఐదుగురు టీనేజర్లు నీట మునిగి ప్రాణాలు కోల్పోయారు. కృష్ణసాగర్ లేక్‌లోకి దిగి ప్రమాదంలో పడిన ఇద్దరు టీనేజర్లను కాపాడే ప్రయత్నంలో మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. దురదృష్టవశాత్తూ ఈ ముగ్గురూ మృత్యువాతపడ్డారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, బోతాద్ జిల్లాలోని కృష్ణసాగర్ లేక్‌లో మునిగేందుకు ఐదుగురు టీనేజర్లు వెళ్లారు. వారిలో ఇద్దరు తొలుత నీటిలో దిగి మునిగిపోతుండటంతో మరో ముగ్గురు వారిని రక్షించేందుకు నీటిలో దిగారు. వీరు కూడా ప్రాణాలు కోల్పోయారు. మృతులంతా 16 నుంచి 17 యేళ్ల వారేనని స్థానిక పోలీసులు వెల్లడించారు. ఈ ఘటన గురించి తెలిసిన వెంటనే పోలీసులు వారిని రక్షించే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. 
 
దీనిపై జిల్లా ఎస్పీ కిషోర్ బలోలియా మాట్లాడుతూ, శనివారం మధ్యాహ్నం తొలుత ఇద్దరు బాలురు నదిలోకి దిగి మునిగిపోవడం ప్రారంభించారు. అక్కడ ఉన్న మరో ముగ్గురు తమ స్నేహితులను రక్షించేందుకు ప్రయత్నించారు. దురదృష్టవశాత్తూ వారు కూడా మరణించారని ఆయన వివరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

మహేష్ బాబు, సితార ఘట్టమనేని PMJ జ్యువెల్స్ సెలబ్రేటింగ్ డాటర్స్ లో మెరిశారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments