Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిందితుడికి కరోనా.. క్వారంటైన్‌లోకి 42మంది పోలీసులు!!

Webdunia
మంగళవారం, 7 జులై 2020 (23:02 IST)
జార్ఖండ్ పోలీసులకు కరోనా చుక్కలు చూపిస్తోంది. జార్ఖండ్‌లో ఇటీవల అరెస్టయిన ఇద్దరు నిందితుల్లో ఒకరికి కరోనా పాజిటివ్ అని తేలడంతో... పోలీసులు క్వారంటైన్‌కు వెళ్లాల్సి వచ్చింది. ఈ క్రమంలో నిందితుడిని అదుపులోకి తీసుకోవడానికి వెళ్లిన డీఎస్పీ సహా 42 మంది పోలీసుల్ని క్వారంటైన్‌కు తరలించారు.
 
వివరాల్లోకి వెళితే.. కొడెర్మా జిల్లాలోని చుటియారో గ్రామంలో అక్రమంగా మద్యం తయారు చేస్తున్న ఓ యూనిట్‌పై పోలీసులు దాడి చేశారు. అక్కడ ఇద్దరు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు.
 
కరోనా నిబంధనల ప్రకారం.. జైలుకు తరలించడానికి ముందు వారికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. ఒకరికి పాజిటివ్‌ తేలింది. దీంతో వెంటనే అతణ్ని ఆస్పత్రికి తరలించారు. మరొకరిని జైలుకు పంపారు. అలాగే రైడ్‌కు వెళ్లిన 42 మంది పోలీసుల్ని క్వారంటైన్‌ కేంద్రానికి తరలించారు.
 
నిందితుడు ఉన్న జైలు పరిసరాలు సహా చుటియారో గ్రామాన్ని పూర్తిగా క్రిమిసంహారక మందులతో శుభ్రపరిచారు. మద్యం తయారీ కేంద్రం ఉన్న ప్రాంతాన్ని కంటైన్‌మెంట్‌ జోన్‌గా ప్రకటించారు. అతణ్ని ఈ మధ్య కలిసిన వారందరినీ గుర్తించి పరీక్షలు నిర్వహిస్తామని అధికారులు తెలిపారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments