Webdunia - Bharat's app for daily news and videos

Install App

జార్ఖండ్‌లో పానీపూరి ఆరగించి 50 మందికి అస్వస్థత - వీరిలో చిన్నారులు కూడా..

Webdunia
ఆదివారం, 22 అక్టోబరు 2023 (12:05 IST)
జార్ఖండ్ రాష్ట్రంలో ఓ విషాదకర ఘటన జరిగింది. పానీపూరి ఆరగించిన 50 మంది చిన్నారులు అస్వస్థతకు లోనయ్యారు. వీరిలో పది మంది మహిలలు కూడా ఉన్నారు. ఈ ఘటన కోడెర్మా జిల్లాలో జరిగింది. శుక్రవారం సాయంత్రం లోకై పంచాయతీ పరిధిలోని గోసైన్ తోలా ప్రాంతంలో వీధి వ్యాపారి వద్ద కొనుగోలు చేసిన పానీపూరీలు ఆరగించిన వారంతా అస్వస్థతకు లోనయ్యారు. ఆ తర్వాత వారంతా అస్వస్థతకు లోనయ్యారు. 
 
ఈ పానీపూరీలు ఆరగించిన వారంతా వాంతులు, విరేచనాలతో అనారోగ్యం పాలయ్యారు. అస్వస్థకు గురైన వారిలో 40 మంది పిల్లలు, పది మంది మహిళలు కూడా ఉన్నారు. వారిని చికిత్స కోడెర్మాలోని సదర్ ఆస్పత్రికి తరలించారు. కాగా, కలుషిత ఆహారం ఆరగించడం వల్లే వారంతా అస్వస్థతకు లోనైట్టు వైద్యాధికారులు వెల్లడించారు. అనారోగ్యంపాలైన వారిలో 9 నుంచి 15 యేళ్ల వయసు కలిగిన పిల్లలు ఉన్నట్టు తెలిపారు. ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగా ఉందని వెల్లడించారు. మరోవైపు వీధి వ్యాపారి నుంచి ఫుడ్ శాంపిల్స్ సేకరించి, వాటిని రాంచీలోని ప్రయోగశాలకు పంపించారు.   

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments