Webdunia - Bharat's app for daily news and videos

Install App

జార్ఖండ్‌లో పానీపూరి ఆరగించి 50 మందికి అస్వస్థత - వీరిలో చిన్నారులు కూడా..

Webdunia
ఆదివారం, 22 అక్టోబరు 2023 (12:05 IST)
జార్ఖండ్ రాష్ట్రంలో ఓ విషాదకర ఘటన జరిగింది. పానీపూరి ఆరగించిన 50 మంది చిన్నారులు అస్వస్థతకు లోనయ్యారు. వీరిలో పది మంది మహిలలు కూడా ఉన్నారు. ఈ ఘటన కోడెర్మా జిల్లాలో జరిగింది. శుక్రవారం సాయంత్రం లోకై పంచాయతీ పరిధిలోని గోసైన్ తోలా ప్రాంతంలో వీధి వ్యాపారి వద్ద కొనుగోలు చేసిన పానీపూరీలు ఆరగించిన వారంతా అస్వస్థతకు లోనయ్యారు. ఆ తర్వాత వారంతా అస్వస్థతకు లోనయ్యారు. 
 
ఈ పానీపూరీలు ఆరగించిన వారంతా వాంతులు, విరేచనాలతో అనారోగ్యం పాలయ్యారు. అస్వస్థకు గురైన వారిలో 40 మంది పిల్లలు, పది మంది మహిళలు కూడా ఉన్నారు. వారిని చికిత్స కోడెర్మాలోని సదర్ ఆస్పత్రికి తరలించారు. కాగా, కలుషిత ఆహారం ఆరగించడం వల్లే వారంతా అస్వస్థతకు లోనైట్టు వైద్యాధికారులు వెల్లడించారు. అనారోగ్యంపాలైన వారిలో 9 నుంచి 15 యేళ్ల వయసు కలిగిన పిల్లలు ఉన్నట్టు తెలిపారు. ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగా ఉందని వెల్లడించారు. మరోవైపు వీధి వ్యాపారి నుంచి ఫుడ్ శాంపిల్స్ సేకరించి, వాటిని రాంచీలోని ప్రయోగశాలకు పంపించారు.   

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments