Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోషియాన్ జిల్లాలో ఎన్‌కౌంటర్ - నలుగురు ఉగ్రవాదుల హతం

Webdunia
సోమవారం, 22 మార్చి 2021 (11:06 IST)
భారత్ పాకిస్థాన్ సరిహద్దుల్లో మరోమారు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. జమ్మూకాశ్మీర్‌లోని షోపియాన్‌ జిల్లాలో ఉగ్రవాదులు, భారత జవాన్ల మధ్య కాల్పులు కలకలం రేపాయి. భద్రత దళాలు చేపట్టిన ఈ ఎన్‌కౌంటర్‌లో నలుగురు ఉగ్రవాదులు మరణించారు. 
 
ప్రస్తుతం జవాన్లు - ఉగ్రవాదుల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. స్థానికంగా ఉన్న పోలీసులు, సీఆర్‌పీఎఫ్‌ దళాలు సమన్వయంగా ఈ ఆపరేషన్‌ చేపట్టినట్లు సమాచారం. సోమవారం ఉదయం రెండు గంటలకు ఈ ఎన్‌కౌంటర్‌ జరిగినట్లు తెలుస్తోంది.
 
మనిహాల్ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కినట్టు సమాచారం అందుకున్న సైన్యం, సీఆర్‌పీఎఫ్, జమ్మూకశ్మీర్ పోలీసులు ఈ తెల్లవారుజామున ఆ ప్రాంతాన్ని దిగ్బంధించి తనిఖీలు చేపట్టారు.
 
భద్రతా బలగాల రాకను గమనించిన ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించారు. అప్రమత్తమైన సైన్యం ఎదురు కాల్పులు ప్రారంభించింది. కాల్పులు ఆగిన తర్వాత ఘటనా స్థలంలో చూడగా నలుగురు ఉగ్రవాదులు హతమై కనిపించారు. 
 
వీరంతా లష్కరే తాయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన వారుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలం నుంచి ఆయుధాలను స్వాధీనం చేసుకున్న భద్రతా దళాలు ఆపరేషన్‌ను కొనసాగిస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments