Webdunia - Bharat's app for daily news and videos

Install App

జమ్మూకాశ్మీర్‌లో జంట ఎన్‌కౌంటర్లు... నలుగురు ఉగ్రవాదుల హతం!!

వరుణ్
ఆదివారం, 7 జులై 2024 (08:26 IST)
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో వరుసగా రెండు ఎన్కౌంటర్లు జరిగాయి. ఇందులో నలుగురు ఉగ్రవాదులు చనిపోగా, లాన్స్‌నాయక్ ప్రదీప్ నయన్, హవల్దార్ ప్రదీప్ కుమార్ అనే ఇద్దరు జవానులు వీరమరణం పొందినట్టు ఆర్మీ అధికారులు వెల్లడించారు. జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని మోడెర్‌గామ్ గ్రామంలో లష్కర్ ఇ తోయిబా ఉగ్రవాదులు దాగివున్నారన్న సమాచారంతో మోడెర్‌గామ్ గ్రామానికి వెళ్లిన భద్రతా బలగాలపై తీవ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో భద్రత దళాలు ఉగ్రవాదులు దాగివున్న ఇంటిని చుట్టుముట్టి ప్రతిదాడికి దిగాయి. ఈ క్రమంలో ఆ ఇంటిలో నక్కివున్న ఇద్దరు తీవ్రవాదులు ప్రాణాలు కోల్పోయారు. అలాగే, తీవ్రవాదులు జరిపిన కాల్పుల్లో లాన్స్‌నాయక్ ప్రదీప్ నయన్ అనే జవాను మృతి చెందినట్టు తెలిపారు. 
 
మరోవైపు, ఫ్రిస్కల్ చిన్నిగమ్ గ్రామంలో కూడా ఉగ్రవాదులు ఉన్నట్టు భద్రతా బలగాలకు పక్కా సమచారం వచ్చింది. ఈ గ్రామంలో ఓ ఇంట్లో దాగివున్న ఉగ్రవాదులతో జరిగిన కాల్పుల్లో ఇద్దరు టెర్రరిస్టులు హతం కాగా, 01 రాష్ట్రీయ రైఫిల్స్‌కు చెందిన హవల్దార్ రాజ్ కుమార్ అమరుడయ్యారు. ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతాలను కాశ్మీర్ ఐజీ వీకే బర్దీ సందర్శించారు. ఉగ్రవాద ఏరివేత చర్యలు కొనసాగిస్తామని ఆయన పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చెత్త సినిమాలు ఎందుకు చేస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు : అనుపమ

బడ్జెట్ రూ.40 కోట్లు.. కలెక్షన్లు రూ.210+ కోట్లు : 'మహవతార్ నరసింహా' ఉగ్రరూపం!!

నా కోసం ప్రభుత్వ వాహనం పంపలేదు... దానికి నాకూ ఎలాంటి సంబంధం లేదు : నిధి అగర్వాల్

ప్రభుత్వ వాహనంలో నిధి అగర్వాల్.. క్లారిటీ ఇచ్చిన హరిహర వీరమల్లు హీరోయిన్

Madhu Shalini : మధు శాలిని ప్రెజెంట్స్ కన్యా కుమారి రిలీజ్ కు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

గౌరవ్ గుప్తా తన బ్రైడల్ కౌచర్ కలెక్షన్, క్వాంటం ఎంటాంగిల్‌మెంట్ ఆవిష్కరణ

తర్వాతి కథనం
Show comments