Webdunia - Bharat's app for daily news and videos

Install App

పట్టాలు తప్పిన చండీగఢ్ - డిబ్రూగఢ్ ఎక్స్‌ప్రెస్ రైలు 12 బోగీలు - నలుగురి మృతి

వరుణ్
గురువారం, 18 జులై 2024 (17:13 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో రైలు ప్రమాదం సంభవించింది. చండీగఢ్ - డిబ్రూగఢ్ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. ఈ రైలుకు చెందిన 12 బోగీలు పక్కకు ఒరిగిపోయాయి. ఈ ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోగా, మరికొందరు గాయపడ్డారు. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. మరోవైపు, ప్రమాద తెలియగానే సహాయక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుంది. అలాగే ప్రమాద వివరాలను యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంబంధింత రైల్వే అధికారులను అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆయన ఆదేశించారు. చండీగఢ్ - డిబ్రూగఢ్ ఎక్స‌ప్రెస్ రైలు 12 కోచ్‌లు పట్టాలు తప్పగా, వీటిలో రెండు ఏసీ బోగీలు కూడా ఉన్నాయి. ఝులాహి రైల్వే స్టేషన్‌కు కొన్ని కిలోమీటర్ల సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. కోచ్‌లలో ఒకటి పల్టీ కొట్టింది. క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారి వివరాలు తెలుసుకునేందుకు ఈస్టర్న్ రైల్వే హెల్ప్ లైన్ ఫోన్ నంబర్లను ప్రకటించింది. 
 
- Commercial Control: 9957555984
- Furkating (FKG): 9957555966
- Mariani (MXN): 6001882410
- Simalguri (SLGR): 8789543798
- Tinsukia (NTSK): 9957555959
- Dibrugarh (DBRG): 9957555960 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

ఎఫ్1 వీకెండ్‌ మియామిలో రానా దగ్గుబాటి, లోకా లోకా క్రూ సందడి

తమిళ దర్శకుడిగా తెలుగు సినిమా చేయడం చాలా ఈజీ : డైరెక్టర్ కార్తీక్ రాజు

త్రిషకు పెళ్ళయిపోయిందా... భర్త ఆ యువ హీరోనా?

రజనీకాంత్ రిటైర్మెంట్ చేస్తారంటే... కామెంట్స్ చేసిన లతా రజనీకాంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

తర్వాతి కథనం
Show comments