Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరణించిన కుమార్తెకు ప్రేతాత్మ వరుడు కావాలెను... తల్లిదండ్రుల ప్రకటన!!

ఠాగూర్
మంగళవారం, 14 మే 2024 (09:34 IST)
ఎపుడో మూడు దశాబ్దాల క్రితం మరణించిన కుమార్తెకు ప్రేతాత్మ వరుడు కావాలంటూ కర్నాటకకు చెందిన తల్లిదండ్రులు ఇచ్చిన ఓ పత్రికా ప్రకటన ఆసక్తికరంగా మారింది. కర్నాటక రాష్ట్రంలోని పుత్తూరు ప్రాంతానికి చెందిన ఓ జంట ఈ తరహా ప్రకటన ఇచ్చింది. ఇందులో కులల్ కులం, బంగే రా గోత్రంలో జన్మించిన వధువుకు తగిన వరుడు కావలెను. వధువు 30 యేళ్ల క్రితం మరణించింది. ఇదే కులం, వేరొక గోత్రంలో జన్మించిన 30 సంవత్సరాల క్రితం మరణించిన వరుడు ఉన్నట్టయితే, ప్రేత మడువే కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఆయన కటుంబ సభ్యులు సమ్మతిస్తే సంప్రదించండి అంటూ అందులో పేర్కొన్నారు. 
 
పైగా, ఇందుకోసం సంప్రదించాల్సిన ఫోన్ నంబరును కూడా వారు ఆ ప్రకటనలో పొందుపరిచారు. ఈ ప్రకటనపై దాదాపు 50 మంది స్పందించారని వధువు కుటుంబానికి చెందిన ఓ వ్యక్తి తెలిపారు. ప్రేత మడువే కార్యక్రమాన్ని నిర్వహించే తేదీని త్వరలోనే నిర్ణయిస్తామన్నారు. దక్షిణ, ఉడిపి జిల్లాల్లోని తులునాడు ప్రాంతంలో మరణించినవారి ఆత్మలకు వివాహం చేసే ఆచారం ఉంది. జీవించి ఉన్నవారికి పెళ్లి చేసినట్టుగానే ఈ కార్యక్రమాన్ని కూడా ఘనంగా నిర్వహిస్తుంటారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హోంబాలే ఫిల్మ్స్ మహావతార్ నరసింహ హిరణ్యకశిపు ప్రోమో రిలీజ్

పాకీజాకు పవన్ అండ... పవర్ స్టార్ కాళ్ళు మొక్కుతానంటూ వాసుకి భావోద్వేగం

పోలీస్ వారి హెచ్చరిక లోని పాటకు పచ్చజెండా ఊపిన ఎర్రక్షరాల పరుచూరి

Pawan: పవన్ కళ్యాణ్ సాయంతో భావోద్వేగానికి లోనయిన నటి వాసుకి (పాకీజా)

Ranbir Kapoor: నమిత్ మల్హోత్రా రామాయణం తాజా అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

గుండెపోటు సంకేతాలు నెల ముందే కనిపిస్తాయా?

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

తర్వాతి కథనం
Show comments