Webdunia - Bharat's app for daily news and videos

Install App

తాత, మనవడు కలిసి వెళ్తుండగా దాడి.. పిల్లాడిని అలా కాపాడిన జవాన్

Webdunia
బుధవారం, 1 జులై 2020 (13:48 IST)
Kashmir
జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల ఆగడాలకు అంతేలేకుండా పోతోంది. భారత ఆర్మీ జవాన్లు ఎన్నిసార్లు బుద్ది చెప్పినా తీరు మారడం లేదు. అయితే ఓ జవాను చేసిన పనికి ప్రతి ఒక్కరు హ్యాట్సాప్‌ చెప్పాల్సిందే. బుధవారం ఉదయం బారముల్లా జిల్లోలోని సోపోర్‌లో సీఆర్పీఎఫ్‌ పెట్రోలింగ్‌ పార్టీపై ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. 
 
ఈ ఘటనలో ఓ సీఆర్పీఎఫ్‌ జవాన్‌తో పాటు పౌరుడు మరణించారు. అయితే ఓ తాత, మనవడు కలిసి వెళ్తుండగా, ఉగ్రవాదులు సీఆర్పీఎఫ్‌ పెట్రోల్‌ పార్టీపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో తాతతో పాటు ఓ మూడేళ్ల పిల్లాడు కూడా ఉన్నాడు.
 
ఈ దాడిలో మూడేళ్ల బాలుడి తాత మరణించాడు. దీంతో ఉగ్ర కాల్పులకు బాలుడు తీవ్రభయభ్రాంతులకు గురయ్యాడు. ఇక తాత మరణించినా.. బాలుడిని కాపాడేందుకు రక్షణగా నిలిచాడు ఓ జవాను. ఆ బాలున్ని రక్షించి సురక్షితంగా ఇతర ప్రాంతానికి చేరవేశాడు. ఈ ఉగ్రదాడిలో మరో ముగ్గురు జవాన్లు గాయపడ్డారు. 
 
ఉగ్రవాదులతో పోరాడుతూ బాలున్ని కాపాడిన జవానుపై ప్రశంసలు కురిపిస్తున్నారు. రక్తపు మడుగులో ఉన్న తాతను చూసి ఏడ్చుకుంటూ లేపే ప్రయత్నం చేశాడు. శవం వద్ద కూర్చుని ఏడుస్తూ బిక్కుబిక్కుమంటూ ఉండిపోయాడు. ఆ సమయంలో జవాను ఆ పిల్లాడిని ఎత్తుకుని సురక్షిత ప్రాంతానికి తరలించాడు. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జగన్ ఉన్నపుడే బావుండేది.. వచ్చే దఫా గెలవడం కష్టం : జేసీ ప్రభాకర్ రెడ్డి

బాలు వెళ్లిపోయాక అంతా చీకటైపోయింది ... : పి.సుశీల

Raviteja: వినాయక చవితికి రవితేజ మాస్ జాతార చిత్రం సిద్దం

Gaddar Award : అల్లు అర్జున్, నాగ్ అశ్విన్ లకు బెస్ట్ అవార్డులు ప్రకటించిన గద్దర్ అవార్డ్ కమిటీ

Sreeleela: పవన్ కళ్యాణ్ ఓజీ కోసం వస్తున్నారు.. డేట్లు సర్దుకో.. ఓకే చెప్పిన శ్రీలీల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

ఎందుకు ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది?

తర్వాతి కథనం
Show comments