Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముంబై-పూణె ఎక్స్‌ప్రెస్ వేపై ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి

Webdunia
సోమవారం, 18 అక్టోబరు 2021 (22:36 IST)
జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మహారాష్ట్రలోని ఖోపొలి సమీపంలో ఉన్న ముంబై-పూణె ఎక్స్‌ప్రెస్ వేపై జరిగింది. జాతీయ రహదారిపై వాహనాలు రయ్యిరయ్యిన వేగంతో దూసుకెళ్తున్నాయి. ఈ క్రమంలో ఉన్నట్టుండి ఒకేసారి ఆరు వాహనాలు వరుసగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో రెండు లారీల మధ్య కారు ఇరుక్కుని నుజ్జునుజ్జయింది. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా.. ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. 
 
ఈ ఘటనలో కారులో ఉన్న ప్రయాణికుల్లో ఇద్దరు మరణించగా.. కోళ్ల వ్యానులో ఉన్న మరొకరు మరణించినట్లు ఖోపోలి పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ శిరీష్ పవార్ తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కారులో ఇరుక్కున్న బాధితులను బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు.
 
ఈ ఘటన అనంతరం జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జాం అయిందని.. క్లియర్ చేసేందుకు కొంత సమయం పట్టిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఖోపోలి పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan Singh: వివాదంలో పవన్ సింగ్.. హీరోయిన్ అంజలి నడుమును తాకాడు (video)

Pawan Kalyan: ఉస్తాద్ భగత్ సింగ్ పుట్టినరోజు పోస్టర్‌ విడుదల

Monalisa: మలయాళ సినిమాలో నటించనున్న కుంభమేళా మోనాలిసా

Havish: కీలక సన్నివేశాల చిత్రీకరణలో హవీష్, కావ్య థాపర్ ల నేను రెడీ

ప్రియదర్శి, నిహారిక ఎన్.ఎం. నటించిన మిత్ర మండలి దీపావళికి రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments