Webdunia - Bharat's app for daily news and videos

Install App

2జీ స్కామ్‌ దర్యాప్తులో రంజిత్ సిన్హా వేలుపెట్టొద్దు : సుప్రీంకోర్టు

Webdunia
గురువారం, 20 నవంబరు 2014 (18:19 IST)
2జీ స్కామ్ దర్యాప్తులో సీబీఐ డైరక్టర్ రంజిత్ సిన్హా వేలుపెట్టరాదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. అదేసమయంలో కేసు విచారణను సీబీఐ ఉన్నతాధికారులతో జరిపించాలని ఆదేశాలిచ్చింది. సీబీఐ గౌరవం పెంపొందించేలా రంజిత్ వ్యవహరించడంలేదని, కేసు వీగిపోయేలా వ్యవహరిస్తున్నారని ఈ సందర్భంగా కోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. 
 
రంజిత్ సిన్హాపై ఉద్యమకారుడు ప్రశాంత్ భూషణ్ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ సందర్భంగా కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆరోపణలను ప్రముఖ న్యాయవాది ప్రశాంత భూషణ్ చేసిన విషయం తెల్సిందే. తమ సంస్థలకు 2జీ లైసెన్సులు ఇప్పించుకోడానికి నేరపూరిత కుట్రలు చేశారని ఆరోపణలున్న కంపెనీల అధికారులు రంజిత్ సిన్హాను తరచుగా ఆయన నివాసంలో కలుస్తున్నారని ప్రశాంత భూషణ్ ఆరోపించారు. 
 
అయితే తాను ఎలాంటి తప్పు చేయలేదని సీబీఐ డైరెక్టర్ రంజిత్ సిన్హా కోర్టులో విన్నివించుకున్నా కోర్టు తప్పించుకోలేదు. కేసు విచారణలో ఉన్నప్పుడు కొంతమందిని ఇంట్లో కలవడం ఎలాంటి నేరం కాదని ఆయన వాదించారు. మొత్తంమీద సీబీఐ ఈ కేసు విచారణ నుంచి తప్పుకోవాలని ఆదేశించింది. 

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

Show comments