Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉత్తరప్రదేశ్‌‌, హత్రాస్‌లో తొక్కిసలాట.. 27మంది మృతి.. మహిళలే ఎక్కువ

సెల్వి
మంగళవారం, 2 జులై 2024 (17:19 IST)
Stampede
ఉత్తరప్రదేశ్‌‌, హత్రాస్‌లోని రతీభాన్‌పూర్‌లో మంగళవారం జరిగిన తొక్కిసలాటలో 27 మంది భక్తులు మరణించారు. అలాగే 15 మంది మహిళలు గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే.. హత్రాస్ జిల్లాలోని రతీభాన్‌పూర్ గ్రామంలో శివుడి ఉత్సవాలు జరిగాయి. ఈ ఉత్సవాలకు భారీగా భక్తులు పోటెత్తారు. ఆ క్రమంలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 27 మంది భక్తులు మృతి చెందగా, వారిలో 23 మంది మహిళలు, ముగ్గురు చిన్నారులతోపాటు ఒక పురుషుడు ఉన్నారు. 
 
అలాగే క్షతగాత్రులను ఎటాహ్ ఆసుపత్రిలో ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. మరోవైపు ఈ తొక్కిసలాట దుర్ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆరా తీశారు. సంఘటన స్థలానికి చేరుకుని.. వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని ఉన్నతాధికారులను ఈ సందర్భంగా ఆయన ఆదేశించారు.
 
మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపిన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఘటనపై విచారణకు కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఇందులో భాగంగా ఏర్పాటైన ప్యానెల్‌కు అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఆగ్రా), అలీగఢ్ కమీషనర్ నేతృత్వం వహిస్తారు.

హత్రాస్‌లో భోలే బాబా సత్సంగ్ కార్యక్రమంలో ఒక్కసారిగా భక్తులు ఎగబడటంతో తొక్కిసలాట జరిగిందని.. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం వున్నట్లు పోలీసులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments