Webdunia - Bharat's app for daily news and videos

Install App

25 మంది ఎంపీలకు కరోనా పాజిటివ్... తెలుగువారు ఎంతమంది?

Webdunia
సోమవారం, 14 సెప్టెంబరు 2020 (19:08 IST)
దేశాన్ని ఓ కుదుపుకుదుపుతున్న కరోనా వైరస్ ఎలాంటి తారతమ్యాలు చూపించడం లేదు. ఏమాత్రం నిర్లక్ష్యం లేదా అశ్రద్ధగా ఉంటే చాలు ఈ వైరస్ సోకుతోంది. అయితే, సోమవారం నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాల కోసం ఎంపీలందరికీ కరోనా పరీక్షలు నిర్వహించారు. వీరిలో 17 మందికి ఈ వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. అందులో ఏపీకి చెందిన ఇద్దరు ఎంపీలు కూడా ఉన్నారు. 
 
దేశంలో కరోనా వైరస్ భయభ్రాంతులకు గుర్తిచేస్తున్న సమయంలో జరుగుతున్న ఈ సమావేశాల కోసం మునుపెన్నడూ లేనంతగా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలోనే ఎంపీలందరికీ కరోనా వైద్య పరీక్షలు నిర్వహించగా 17 మందికి పాజిటివ్ వచ్చింది. వారిలో చిత్తూరు ఎంపీ ఎన్.రెడ్డెప్ప, అరకు ఎంపీ గొడ్డేటి మాధవి కూడా ఉన్నారు. 
 
కరోనా వైరస్ సోకిన వారిలో బీజేపీకి చెందిన 12 మంది ఎంపీలు ఉండగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు, శివసేన, డీఎంకే, ఆఎల్పీకి చెందిన ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు. అలాగే, మొత్తం 785 మంది ఎంపీల్లో 200మందికి పైగా ఎంపీలు 65 యేళ్లు పైబడినవారే కావడం గమనార్హం. 
 
ఇకపోతే, కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన మిగిలిన ఎంపీల పేర్లను పరిశీలిస్తే, మీనాక్షి లేఖి, అనంత్ కుమార్ హెగ్డే, పర్వేశ్ సాహిబ్ సింగ్, సుఖ్ బీర్ సింగ్, హనుమాన్ బేణివాల్, సుకనాటా మజుందార్, ప్రతాప్ రావ్ జాదవ్, జనార్దన్ సింగ్, బిద్యుత్ బరణ్, ప్రదాన్ బారువా, జి. సెల్వమ్, ప్రతాప్ రావ్ పాటిల్, రామ్ శంకర్ కతేరియా, సత్యపాల్ సింగ్, రోద్మాల్ నాగర్‌లు ఉన్నారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments