Webdunia - Bharat's app for daily news and videos

Install App

మందుల కొరత కారణంగా 24 మంది మృతి.. మృతుల్లో 12 మంది శిశువులు

Webdunia
మంగళవారం, 3 అక్టోబరు 2023 (11:20 IST)
మహారాష్ట్రలో విషాదకర ఘటన జరిగింది. మందుల కొరత కారణంగా ప్రభుత్వాసుపత్రిలో ఏకంగా 24 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 12 మంది శిశువులు కూడా ఉన్నారు. రాష్ట్రంలోని నాందేడ్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ దారుణం వెలుగు చూసింది.
 
80 కిలోమీటర్ల పరిధిలోని ప్రాంతానికి ఒకే ఆసుపత్రి ఉండటంతో రోగుల సంఖ్య విపరీతంగా పెరిగి మందులకు కొరత ఏర్పడినట్టు అక్కడి వైద్యులు చెప్పారు. ఔషధాలను స్థానిక దుకాణాల్లో కొనుగోలు చేసి రోగులకు అందిస్తున్నట్టు తెలిపారు.
 
మందుల కొరతకు కన్నబిడ్డలను పొగొట్టుకున్న తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. వైద్యుల నిర్లక్ష్యం వల్లే తమ నవజాత శిశువు మరణించాడని ఓ తండ్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు.
 
కాగా, ఈ ఘటన ఆ రాష్ట్రంలో రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. మందుల కొరత కారణంగా శిశువుల మృతి సిగ్గుచేటని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మండిపడ్డారు. చిన్నారుల మృతిపై కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ కూడా స్పందించారు. 
 
ప్రచారం కోసం వేల కోట్లు ఖర్చుచేస్తున్న బీజేపీ సర్కారు పిల్లలకు మాత్రం మందులు కూడా అందించలేక పోయిందని మండిపడ్డారు. ఘటనపై తక్షణం దర్యాప్తు జరిపించాలని, సంబంధిత మంత్రులను తొలగించాలని ఎన్సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుప్రీయా సూలే డిమాండ్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డెడ్‌పూల్ & వుల్వరైన్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఆఫ్ ది ఇయర్

రొమాన్స్ సాంగ్ తో డబుల్ ఇస్మార్ట్' షూటింగ్ పూర్తి

నందమూరి కల్యాణ్‌రామ్‌ బింబిసార2. ప్రీక్వెల్‌ అనౌన్స్ మెంట్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తట్టుకోలేని మైగ్రేన్ తలనొప్పి, ఈ చిట్కాలతో చెక్

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: బాదంపప్పుతో మీ చర్మానికి సంపూర్ణ పోషణ

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

అత్యవసర న్యూరోసర్జరీతో 23 ఏళ్ల వ్యక్తిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

తర్వాతి కథనం
Show comments