Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీలో విలయతాండవం.. 195మంది ఎయిమ్స్ సిబ్బందికి కరోనా

Webdunia
గురువారం, 28 మే 2020 (18:46 IST)
దేశ రాజధాని నగరం ఢిల్లీలో కరోనా విజృంభిస్తోంది. ఎయిమ్స్‌లో వైద్య సిబ్బందికి మహమ్మారి సోకడం కలకలం రేపుతోంది. ఢిల్లీ ఎయిమ్స్‌లో ఇప్పటివరకు 195 సిబ్బంది వైరస్ బారినపడ్డారు. గత రెండు రోజుల వ్యవధిలోనే 50మంది సిబ్బందికి ఈ కరోనా వైరస్ సోకింది. 
 
వీరిలో ఎంబీబీఎస్‌ విద్యార్థితో పాటు రెసిడెంట్‌ వైద్యులు, నర్సులు, మెస్‌ వర్కర్లు, లేబోరేటరీ సిబ్బంది, సాంకేతిక సహాయకులు, శానిటేషన్ వర్కర్లు, భద్రతా విభాగాల్లో పనిచేసే సిబ్బంది ఉన్నారు. వీరిలో కొందరు ఈ వైరస్‌ లక్షణాల నుంచి కోలుకొని మళ్లీ విధుల్లోకి హాజరు కాగా.. మిగతా వారంతా చికిత్స పొందుతున్నారు. మరోవైపు, ఈ ఆదివారం శానిటేషన్‌ సూపర్‌వైజర్‌గా పనిచేసిన ఓ వ్యక్తి మృతి చెందాడు.
 
అలాగే ఢిల్లీ మున్సిపల్‌ కౌన్సిల్‌ (ఎన్‌డీఎంసీ) ప్రధాన కార్యాలయాన్ని అధికారులు మూసివేశారు. ఈ కార్యాలయంలో పనిచేసే సీనియర్‌ ఉద్యోగికి కరోనా సోకవడంతో ఈ చర్యలు చేపట్టారు. తాజాగా నమోదైన కేసుతో ఎన్‌డీఎంసీలో ఇప్పటివరకు కరోనా బాధితుల సంఖ్య ఏడుకి చేరింది. 
 
ఇక ఢిల్లీలో కరోనా పాజిటివ్ కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఒక్కరోజే 792 కేసులు నమోదయ్యాయి. దీంతో దేశ రాజధానిలో మొత్తం కేసుల సంఖ్య 15257 చేరింది. ఇప్పటివరకు 303మంది మృతి చెందారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Peddi : పెద్ది చిత్రం తాజా అప్ డేట్ - రామ్ చరణ్ పై కీలక సన్నివేశాల చిత్రీకరణ

థ్రిల్లర్ కథతో మలయాళ ప్రవింకూడు షప్పు- ప్రవింకూడు షప్పు సమీక్ష

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

Nikhil: దేవుడి దయవల్ల తొలి సినిమా హ్యాపీ డేస్ అయింది : హీరో నిఖిల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments