Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీలో విలయతాండవం.. 195మంది ఎయిమ్స్ సిబ్బందికి కరోనా

Webdunia
గురువారం, 28 మే 2020 (18:46 IST)
దేశ రాజధాని నగరం ఢిల్లీలో కరోనా విజృంభిస్తోంది. ఎయిమ్స్‌లో వైద్య సిబ్బందికి మహమ్మారి సోకడం కలకలం రేపుతోంది. ఢిల్లీ ఎయిమ్స్‌లో ఇప్పటివరకు 195 సిబ్బంది వైరస్ బారినపడ్డారు. గత రెండు రోజుల వ్యవధిలోనే 50మంది సిబ్బందికి ఈ కరోనా వైరస్ సోకింది. 
 
వీరిలో ఎంబీబీఎస్‌ విద్యార్థితో పాటు రెసిడెంట్‌ వైద్యులు, నర్సులు, మెస్‌ వర్కర్లు, లేబోరేటరీ సిబ్బంది, సాంకేతిక సహాయకులు, శానిటేషన్ వర్కర్లు, భద్రతా విభాగాల్లో పనిచేసే సిబ్బంది ఉన్నారు. వీరిలో కొందరు ఈ వైరస్‌ లక్షణాల నుంచి కోలుకొని మళ్లీ విధుల్లోకి హాజరు కాగా.. మిగతా వారంతా చికిత్స పొందుతున్నారు. మరోవైపు, ఈ ఆదివారం శానిటేషన్‌ సూపర్‌వైజర్‌గా పనిచేసిన ఓ వ్యక్తి మృతి చెందాడు.
 
అలాగే ఢిల్లీ మున్సిపల్‌ కౌన్సిల్‌ (ఎన్‌డీఎంసీ) ప్రధాన కార్యాలయాన్ని అధికారులు మూసివేశారు. ఈ కార్యాలయంలో పనిచేసే సీనియర్‌ ఉద్యోగికి కరోనా సోకవడంతో ఈ చర్యలు చేపట్టారు. తాజాగా నమోదైన కేసుతో ఎన్‌డీఎంసీలో ఇప్పటివరకు కరోనా బాధితుల సంఖ్య ఏడుకి చేరింది. 
 
ఇక ఢిల్లీలో కరోనా పాజిటివ్ కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఒక్కరోజే 792 కేసులు నమోదయ్యాయి. దీంతో దేశ రాజధానిలో మొత్తం కేసుల సంఖ్య 15257 చేరింది. ఇప్పటివరకు 303మంది మృతి చెందారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులపై స్పందించిన విజయ్ దేవరకొండ

Rashmika: విజయ్ దేవరకొండ ఇంట్లో ఫోటో షూట్ చేసిన రష్మిక- ఆ చీరను ఎవరిచ్చారు?

బీఎన్‌ రెడ్డి పురస్కారం ఎంతో గౌరవంగా భావిస్తున్నాను: దర్శకుడు సుకుమార్‌

సైనిక అధికారులకు కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రదానోత్సవం

కమెడియన్‌ ప్రవీణ్‌ బకాసుర రెస్టారెంట్‌ నుంచి జాతీయం లిరికల్‌ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments