Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓర్ని వీడి సెల్ఫీ పిచ్చి పిచ్చుకలు తీసుకెళ్లా... మహిళా జడ్జితో సెల్ఫీ తీస్కోబోయి...

Webdunia
శుక్రవారం, 5 ఫిబ్రవరి 2016 (12:24 IST)
సెల్ఫీ పిచ్చి ఈమధ్య మరీ పిచ్చిలా ముదిరిపోతోంది. కదులుతున్న రైళ్లలో నుంచి, పర్వత శిఖరపు అంచుల నుంచి, రెండు ఎత్తైన భవనాల మధ్య ఉండే ఖాళీ కనబడేట్లుగా అంచుల్లో నిలబడి సెల్ఫీలు తీసుకోబోయే పలువురు యువకులు ప్రమాదాల బారిన పడి ప్రాణాలు విడిచారు. ఇన్ని ఘటనలు చూసినా కుర్రకారులో మాత్రం సెల్ఫీ పిచ్చి వదలడంలేదు. తాజాగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బులంద్షార్ జిల్లాలో 18 ఏళ్ల యువకుడు ఏకంగా జిల్లా మహిళా జడ్జితోనే సెల్ఫీ తీసుకోవాలని ప్రయత్నించి బుక్కయ్యాడు. 
 
వివరాల్లోకి వెళితే... చంద్రకళ యూపీలోని బులంద్షార్ జిల్లా మేజిస్ట్రేటుగా ఉన్నారు. ఈ క్రమంలో కమలాపూర్ గ్రామానికి చెందిన 18 ఏళ్ల అహ్మద్ జడ్జి మాట్లాడుతున్న సమావేశానికి హాజరయ్యాడు. అక్కడికి వచ్చిన ఆ యువకుడు జడ్జితో సెల్ఫీ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టాడు. 
 
ఆమె మాట్లాడుతుండగానే పక్కగా వెళ్లి సెల్ఫీ కోసం సెల్ ఫోనును పదేపదే క్లిక్ క్లిక్‌మనిపించసాగాడు. జడ్జి వారించినా అతడు పట్టించుకోలేదు. సెల్ఫీ కోసం క్లిక్కులు చేస్తూనే ఉన్నాడు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి అతడిని అరెస్టు చేశారు. ఈ ఘటన సోమవారం జరుగగా అతడిని అరెస్టు చేసి గురువారం నాడు బెయిల్ పైన విడుదల చేశారు.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments