Webdunia - Bharat's app for daily news and videos

Install App

అత్యాచారం చేసి... భవనంపై నుంచి కిందికి తోసేశారు...

Webdunia
శుక్రవారం, 11 డిశెంబరు 2020 (20:31 IST)
గుజరాత్ రాష్ట్రంలో దారుణం జరిగింది. ఓ యువతిపై అత్యాచారం చేసిన దుండగులు ఆమెను భవనం నుంచి కిందికి తోసేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే..
 
గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ నగరం, పార్లే పాయింట్ ఏరియాలో ఓ 18 యేళ్ళ యువతిపై కొందరు దుండగులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత ఈ విషయాన్ని బయటకు చెప్పకుండా ఉండేందుకు బాధితురాలిని భవనం నుంచి కిందికి తీసేశారు.
 
దాంతో బ‌హుళ అంత‌స్తుల భ‌వ‌నాల మ‌ధ్య‌గా ఉన్న రోడ్డుపై ఆ యువ‌తి ప‌డిపోయింది. తీవ్ర గాయాల‌తో అప‌స్మార‌క స్థితిలో ప‌డివున్న యువ‌తిని చూసి స్థానికులు పోలీసులకు స‌మాచారం ఇచ్చారు. దాంతో పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని యువ‌తిని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.
 
ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు. గురువారం ఉద‌యం ఆప‌స్మార‌క స్థితిలో ఉన్న యువ‌తిని ఆస్ప‌త్రి చేర్చామ‌ని, అదేరోజు సాయంత్రానికి ఆమె స్పృహ‌లోకి వ‌చ్చింద‌ని పోలీసులు చెప్పారు. 
 
అయితే నిందితుడు ఎవ‌ర‌నే విష‌యాన్ని బాధితురాలి చెప్ప‌లేక‌పోతున్న‌దని, తాము ప్ర‌స్తుతం నిందితుడిని గుర్తించే ప‌నిలో ఉన్నామ‌ని తెలిపారు. నిందితుడు ప‌ట్టుబ‌డితే కేసు చిక్కుముడి వీడే అవకాశం ఉంద‌న్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏఎం రత్నంపై ఫిర్యాదులు - 'హరిహర వీరమల్లు' రిలీజ్‌కు చిక్కులా?

దళితుడిని అని తెలిశాకే.. సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.: బాబు మోహన్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments