Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీలో దారుణం.. యువతిని కాల్చేసిన స్నేహితుడు.. హోటల్, షాపింగ్‌కు తీసుకెళ్లి... ఇంటిముందే?

ఢిల్లీలో మహిళలపై అరాచకాలు పెచ్చరిల్లిపోతున్నాయి. ఢిల్లీలో ఓ యువతిపై స్నేహితుడే కాల్పులు జరిపాడు. అదీ ఆమె ఇంటి ముందే ఈ ఘోరం జరిగిపోయింది. బుల్లెట్ శబ్దంవిని బయటకు పరుగెత్తుకు వచ్చిన తల్లికి రక్తపు మడుగ

Webdunia
బుధవారం, 21 డిశెంబరు 2016 (12:43 IST)
ఢిల్లీలో మహిళలపై అరాచకాలు పెచ్చరిల్లిపోతున్నాయి. ఢిల్లీలో ఓ యువతిపై స్నేహితుడే కాల్పులు జరిపాడు. అదీ ఆమె ఇంటి ముందే ఈ ఘోరం జరిగిపోయింది. బుల్లెట్ శబ్దంవిని బయటకు పరుగెత్తుకు వచ్చిన తల్లికి రక్తపు మడుగులో ఉన్న కూతురు కనిపించింది. ఢిల్లీలోని నజఫ్ ఘడ్‌కు చెందిన ఓ యువతి యోగేష్, శుభమ్ అనే ఇద్దరు స్నేహితులతో కలిసి మధ్యాహ్న భోజనానికి వెళ్ళింది. 
 
ఆపై షాపింగ్‌కు కూడా వెళ్ళింది. స్నేహితులతో కలిసి బయటికి వెళ్లిన కుమార్తె ఇంకా ఇంటికి రాలేదని తల్లి ఆందోళన వ్యక్తం చేసింది. అయితే కుమార్తె షాపింగ్ చేస్తున్నామని త్వరలోనే ఇంటికి చేరుకొంటామని ఫోనులో చెప్పడంతో ఊపిరి పీల్చుకుంది. ఇంతలోనే యువతిని స్నేహితులు ఇంటి వద్ద దింపారు.
 
కారు నుంచి దిగి యోగేష్‌తో యువతి మాట్లాడుతుండగానే, కారులో కూర్చున్న శుభమ్ అనే వ్యక్తి యువతిపై కాల్పులు జరిపి పారిపోయాడు. ఈ ఘటనలో యువతి ప్రాణాలు కోల్పోగా.. ఇంటికి వచ్చేసిందనుకున్న కుమార్తె కాల్పులకు గురైందని తెలిసి.. ఆ తల్లి బోరున విలపించింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments