Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీహార్‌లో పిడుగుల వర్షం - 17 మంది మృత్యువాత

Webdunia
సోమవారం, 20 జూన్ 2022 (11:33 IST)
బీహార్ రాష్ట్రంలో పిడుగుల వర్షం కురిసింది. ఈ వర్షం ధాటికి 17 మంది మృత్యువాతపడ్డారు. ఉరుములు మెరుపులతో పాటు పిడుగులతో కురిసిన భారీ వర్షానికి భాగల్‌పూర్‌లో ఆరుగురు, వైశాలి జిల్లాలో ముగ్గురు ఖగారియాలో ఇద్దరు, బంకాలో ఇద్దరు, కతిహార్‌లో ఒకరు, నహర్సాలో ఒకరు, మాధేపురాలో ఒకరు, ముంగేర్‌లో ఒకరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. 
 
ఈ ఘటనలపై బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తన ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. అలాగే మృతుల కుటుంబాలకు రూ.4 లక్షలు చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. ప్రతికూల వాతావరణంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. పిడుగులు పడేసమయంలో విపత్తుల శాఖ జారీ చేసిన సూచనలు పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. 
 
మరోవైపు, నైరుతి రుతుపవనాలు గుజరాత్, మధ్యప్రదేశ్, విదర్భ, ఛత్తీస్‌గఢ్, వెస్ట్ బెంగాల్, జార్ఖండ్, బీహార్ రాష్ట్రాల్లో చురుకుగా కదులుతున్నాయని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో ఉత్తర, మధ్య తీర్పు భారతం అంతటా రెండు మూడు రోజుల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments