Webdunia - Bharat's app for daily news and videos

Install App

కల్తీసారాకు 16 మంది మృతి.. ఎక్కడ?

Webdunia
శుక్రవారం, 22 ఫిబ్రవరి 2019 (16:01 IST)
పగలంతా తేయాకు తోటల్లో పనిచేసిన కూలీలు రాత్రి వేడుక చేసుకుందామనుకున్నారు. ఇందులో భాగంగా స్థానికంగా ఉండే మద్యం దుకాణం నుండి మద్యం తెప్పించారు. అది 17 మంది ప్రాణాలను బలిగొంది. దానిని సేవించిన మరికొంత మంది పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన అసోంలోని గోలాఘాట్‌లో జరిగింది. గోలాఘాట్‌లోని సల్మారా టీ ఎస్టేట్‌లో పనిచేస్తున్న కూలీలు గురువారం రాత్రి వేడుక చేసుకున్నారు. వారికి స్థానికంగా ఉండే సంజు ఒరాంగ్‌ అనే వ్యక్తి మద్యం సరఫరా చేశాడు. మద్యం సేవిస్తుండగా కొద్ది సేపటికి నలుగురు మహిళలు కిందపడిపోయారు. వారిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. 
 
పరీక్ష చేసిన వైద్యులు వారు అప్పటికే మృతి చెందినట్లు చెప్పారు. విషపూరిత మద్యం తాగినందువల్లే ఇలా జరిగిందని చెప్పారు. శుక్రవారం ఉదయం మరో 13 మంది మృత్యువాతపడ్డారు. కొంత మంది ఆసుపత్రిపాలయ్యారు. దాదాపుగా 30 మందికి పైగా ఆ వేడుకలో విషపూరిత మద్యం సేవించారని పోలీసులు వెల్లడించారు. ఆసుపత్రిలో ఉన్నవారి పరిస్థితి విషమంగా ఉందని, మరింత మంది చనిపోయే అవకాశం ఉందని కూడా వారు చెప్పారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. రసాయనాల క్యాన్‌లలో మద్యాన్ని తీసుకురావడం వల్లే అది కలుషితమైందని భావిస్తున్నారు. అది కల్తీ మద్యం అయి ఉంటుందనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రామాయణం: సీత పాత్రకు సాయి పల్లవి యాప్ట్ కాదంటోన్న నెటిజన్లు.. ట్రోల్స్ మొదలు

ఈడీ విచారణకు హాజరైన ఏస్ ప్రొడ్యూసర్.. వివరణ ఇచ్చిన అల్లు అరవింద్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments