Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ బాలికపై అత్యాచారం జరగలేదు.. విషం తాగి చనిపోయింది.. ప్రేమే కారణమా?

Webdunia
సోమవారం, 20 జులై 2020 (14:38 IST)
పశ్చిమ బెంగాల్‌లో సంచలనం సృష్టించిన అత్యాచారం కేసులో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. పదో తరగతి కూతురిని తండ్రే అత్యాచారానికి పాల్పడి చంపేశాడని ఆరోపణలు వచ్చాయి.

కానీ పోస్టుమార్టం నివేదికలో సంచలన విషయాలు వెలుగుచూశాయి. ఆమెపై రేప్ జరగలేదని నివేదికలో వెల్లడి అయ్యింది. శరీరంపై ఎలాంటి గాయాలు లేవని.. లైంగిక దాడి జరిగినట్లు ఆనవాళ్లు లేవని వైద్యులు చెప్పారు. శరీరంలో విషం లభించిందని.. విషం సేవించడం వల్లే చనిపోయిందని స్పష్టం చేశారు.
 
వివరాల్లోకి వెళితే.. ఉత్తర దినజ్‌పూర్‌ జిల్లాలోని సోనార్‌పూర్ ప్రాంతంలో ఆదివారం 15 ఏళ్ల బాలిక మృతదేహం లభ్యమైంది. ఇంటి నుంచి ఆమెను కిడ్నాప్ చేశారని.. ఆ తర్వాత కొన్ని గంటల్లోనే శవమై కనిపించిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. బాలిక మృతదేహం ఇంటి నుంచి 500 మీటర్ల దూరంలో ఉన్న ఓ చెట్టు కింద లభ్యమైంది. ఘటనా స్థలంలో విషం బాటిల్‌తో పాటు మొబైల్ ఫోన్ దొరికింది.
 
ఆ మొబైల్ ఆధారంగా పోలీసులు జరిపిన విచారణలో ఆ యువకుడికి మృతురాలికి సంబంధాలున్నట్లు తెలుస్తోంది. బాలిక చనిపోయిన మర్నాడే అతడు కూడా ప్రాణాలు కోల్పోయాడు. సోమవారం సోనార్‌పూర్‌లోని చెరువు వద్ద ఫిరోజ్ అనే అతడి మృతదేహం లభ్యమైంది. అతడి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం