Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ బాలికపై అత్యాచారం జరగలేదు.. విషం తాగి చనిపోయింది.. ప్రేమే కారణమా?

Webdunia
సోమవారం, 20 జులై 2020 (14:38 IST)
పశ్చిమ బెంగాల్‌లో సంచలనం సృష్టించిన అత్యాచారం కేసులో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. పదో తరగతి కూతురిని తండ్రే అత్యాచారానికి పాల్పడి చంపేశాడని ఆరోపణలు వచ్చాయి.

కానీ పోస్టుమార్టం నివేదికలో సంచలన విషయాలు వెలుగుచూశాయి. ఆమెపై రేప్ జరగలేదని నివేదికలో వెల్లడి అయ్యింది. శరీరంపై ఎలాంటి గాయాలు లేవని.. లైంగిక దాడి జరిగినట్లు ఆనవాళ్లు లేవని వైద్యులు చెప్పారు. శరీరంలో విషం లభించిందని.. విషం సేవించడం వల్లే చనిపోయిందని స్పష్టం చేశారు.
 
వివరాల్లోకి వెళితే.. ఉత్తర దినజ్‌పూర్‌ జిల్లాలోని సోనార్‌పూర్ ప్రాంతంలో ఆదివారం 15 ఏళ్ల బాలిక మృతదేహం లభ్యమైంది. ఇంటి నుంచి ఆమెను కిడ్నాప్ చేశారని.. ఆ తర్వాత కొన్ని గంటల్లోనే శవమై కనిపించిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. బాలిక మృతదేహం ఇంటి నుంచి 500 మీటర్ల దూరంలో ఉన్న ఓ చెట్టు కింద లభ్యమైంది. ఘటనా స్థలంలో విషం బాటిల్‌తో పాటు మొబైల్ ఫోన్ దొరికింది.
 
ఆ మొబైల్ ఆధారంగా పోలీసులు జరిపిన విచారణలో ఆ యువకుడికి మృతురాలికి సంబంధాలున్నట్లు తెలుస్తోంది. బాలిక చనిపోయిన మర్నాడే అతడు కూడా ప్రాణాలు కోల్పోయాడు. సోమవారం సోనార్‌పూర్‌లోని చెరువు వద్ద ఫిరోజ్ అనే అతడి మృతదేహం లభ్యమైంది. అతడి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ram Charan: నైట్ పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్ కేక్ కట్ చేశాడు

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం