Webdunia - Bharat's app for daily news and videos

Install App

సుప్రీంకోర్టును కుదిపేస్తున్న కరోనా.. 15 మంది జడ్జీలకు పాజిటివ్

Webdunia
గురువారం, 22 ఏప్రియల్ 2021 (15:45 IST)
సుప్రీంకోర్టులో 15 మంది న్యాయమూర్తులకు కరోనా సోకినట్లు తేలింది. అందులో ఒకరు చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేరారు. తమ సిబ్బందికి కరోనా వచ్చిందని ముగ్గురు న్యాయమూర్తులు వెల్లడించారు. కరోనా రెండో దశ వ్యాప్తి సుప్రీంకోర్టును కుదిపేస్తోంది. ఇప్పటికే వైరస్ ప్రభావం కేసుల విచారణపై పడింది. 
 
తాజాగా.. సుప్రీంకోర్టులో 15 మంది న్యాయమూర్తులకు కరోనా సోకినట్లు తేలింది. అందులో ఒకరు ఆస్పత్రిలో చేరినట్లు తెలుస్తోంది. అదేసమయంలో, తమ సిబ్బందికి కరోనా సోకిందని.. న్యాయమూర్తులు జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ ఇందిరా బెనర్జీ, జస్టిస్ సూర్యకాంత్​లు వెల్లడించారు. 
 
పరిమిత కేసులు.. వర్చువల్ వాదనలు
తొలి దశలో కరోనా వ్యాప్తి సందర్భంగా సుప్రీంలో ఎటువంటి పరిస్థితి ఉండేదో.. ప్రస్తుతం అదే విధంగా ఉందని అధికారులు చెబుతున్నారు. న్యాయమూర్తులు తమ స్వస్థలాల నుంచే వర్చువల్​గా వాదనలు వింటున్నారు. ఇప్పుడు.. 11 న్యాయమూర్తులతో కూడిన నాలుగు బెంచీలు వాదనలు ఆలకిస్తున్నాయి. పరిమితమైన కేసులను మాత్రమే విచారిస్తున్నారు.
 
సుప్రీంలోని న్యాయమూర్తులందరికీ నెల క్రితమే వ్యాక్సిన్ అందించారు. న్యాయవాదులు, సిబ్బందికి టీకా ఇచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. లక్షణాలు ఉన్నవారికి ఆర్​టీ - పీసీఆర్ పరీక్షలు తప్పనిసరి చేసింది న్యాయస్థానం. కరోనా​ లక్షణాలు కనిపిస్తే కోర్టుకు రావొద్దని సూచించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments