Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీహరికోట షార్‌లో కరోనా కలకలం... ఒకే రోజు 142 పాజటివ్ కేసులు

Webdunia
బుధవారం, 19 జనవరి 2022 (13:41 IST)
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)కు చెందిన ఉపగ్రహ ప్రయోగ కేంద్రం షార్ సెంటరులో పని చేసే ఉద్యోగులపై కరోనా వైరస్ విరుచుకుపడింది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలో ఉన్న ఈ అంతరిక్ష పరిశోధనా కేంద్రంలో కరోనా కల్లోలం సృష్టిస్తుంది. ఒకే రోజు ఏకంగా 142 పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. దీంతో ఉద్యోగులతో పాటు ఉన్నతాధికారులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. 
 
మంగళవారం ఏకంగా 91 మందికి ఉద్యోగులకు ఈ వైరస్ సోకింది. సంక్రాంతి సెలవులకు ఊర్లకు వెళ్లి వస్తున్న వారికి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయగా, అనేక కేసులు బయటపడుతున్నాయి. ఇప్పటికే 50 శాతం మంది ఉద్యోగులతో షార్ కేంద్రం పని చేస్తుంది. 
 
ఇపుడు అనేక మంది ఈ వైరస్‌ కోరల్లో చిక్కుకున్నారు. ఒకే రోజులో 142 మందికి కరోనా సోకినట్టు నిర్ధారణ కావడంతో మిగిలిన ఉద్యోగులు సైతం ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం ఈ కేంద్రంలో ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి కోవిడ్ టెస్టులు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

దేవర ఫియర్ సాంగ్ వర్సెస్ పుష్ప సాంగ్.. జరగండి అంటోన్న చెర్రీ

కనీసం నా పిల్లలతో చాక్లెట్ పార్టీకి కూడా తీరికలేదు, రేవ్ పార్టీనా?: జానీ మాస్టర్ - video

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా

అబ్బాయిలూ ఇలా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చెంపలు చెళ్లుమంటాయి

పాయల్ రాజ్‌పుత్ పైన రక్షణ నిర్మాత ఫిలిం ఛాంబర్‌కు ఫిర్యాదు

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments