Webdunia - Bharat's app for daily news and videos

Install App

డైమండ్ ప్రిన్సెస్‌లో నౌకలో ఉన్న భారతీయులు అంతేనా.. కేంద్ర మంత్రి ఏమన్నారు?

Webdunia
శుక్రవారం, 14 ఫిబ్రవరి 2020 (12:34 IST)
జపాన్ విహార నౌక అయిన డైమండ్ ప్రిన్సెస్‌లో ఉన్న పర్యాటకుల్లో కరోనా వైరస్ బారినపడివారిలో భారతీయులు కూడా ఉన్నారు. ఈ నౌకను జపాన్ ప్రభుత్వం నిర్భంధంలో ఉంచింది. అయితే, ఈ నౌకలో ఉన్న భారతీయులను వెనక్కి తీసుకొచ్చే అవకాశంలేదని కేంద్ర ఆరోగ్య శాఖామంత్రి హర్షవర్ధన్ తెలిపారు.
 
కొవిడ్ -19 వైరస్ సోకిన నేపథ్యంలో జపాన్ విహార నౌక అయిన డైమండ్ ప్రిన్సెస్‌ను టోక్యో తీరంలోని యోకహామా వద్ద సముద్రంలోనే జపాన్ ప్రభుత్వం నిర్బంధించింది. ఈ నౌకలో 3,711 మంది ఉండగా, వీరిలో 138 మంది భారతీయులు ఉన్నారు. డైమండ్ ప్రిన్సెస్ విహార నౌకలో ఉన్న ఇద్దరు భారతీయులకు కొవిడ్ -19 వైరస్ సోకిందని, వారికి నౌకలోనే చికిత్స అందిస్తున్నారు. ఈ విషయాన్ని భారత విదేశాంగశాఖ మంత్రి ఎస్ జైశంకర్ వెల్లడించారు. 
 
అయితే, కొవిడ్-19 వైరస్ నివారించేందుకు జపాన్ దేశం విహారనౌకలో 138 మంది భారతీయులను నిర్బంధించినందున వారిని బయటకు తీసుకురాలేమని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ తెలిపారు. అయితే, నౌకలోని భారతీయుల గురించి తమ రాయబార కార్యాలయం జపాన్ అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతుందని కేంద్ర మంత్రులు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Jaggareddy: అంతా ఒరిజిన‌ల్, మీకు తెలిసిన జెగ్గారెడ్డిని తెర‌మీద చూస్తారు : జ‌గ్గారెడ్డి

Ram Charan: శ్రీరామ‌న‌వ‌మి సంద‌ర్భంగా రామ్ చ‌ర‌ణ్ చిత్రం పెద్ది ఫ‌స్ట్ షాట్

Samantha: శుభం టీజర్ చచ్చినా చూడాల్సిందే అంటున్న స‌మంత

ఆ గాయం నుంచి ఆరు నెలలుగా కోలుకోలేకపోతున్నా : రకుల్ ప్రీత్ సింగ్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments