Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆగివున్న లారీని ఢీకొట్టిన టెంపో వ్యాను...13 మంది మృత్యువాత

వరుణ్
శుక్రవారం, 28 జూన్ 2024 (10:57 IST)
కర్నాటక రాష్ట్రంలోని హవేరీ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై ఆగివున్న లారీని అమిత వేగంతో దూసుకొచ్చిన ఓ టెంపో వ్యాను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 13 మంది మృత్యువాతపడ్డారు. మరికొందరు గాయపడ్డారు. బెళగావిలోని ఆలయాలను దర్శించుకుని వస్తుండగా ఈ ఘోరం జిరగింది. శుక్రవారం తెల్లవారుజామున హవేరి జిల్లా గుండెనహల్లి సమీపంలోని పూణె - బెంగుళూరు జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. 
 
ఆగివున్న లారీని ఓ టెంపో వ్యాను బలంగా ఢీకొట్టింది. దీంతో ప్రమాదస్థలిలోనే 13మంది చనిపోయారు. మృతుల్లో ఇద్దరు చిన్నారు కూడా ఉన్నారు. మృతులను షిమోగా జిల్లా భద్రపతి తాలూకాలోన ఎమ్మినిహట్టి గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. 
 
ప్రమాద తీవ్రతకు కొన్ని మృతదేహాలను టెంపో వ్యానులోనే చిక్కుకునిపోయాయి. వీటిని వెలికి తీసేందుకు శ్రమించాల్సివచ్చింది. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని అతి కష్టంమీద టెంపో వ్యానులో చిక్కుకున్న మృతదేహాలను వెలికి తీశారు. కాగా, ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మరో నలుగురిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mangli: పార్టీలో డ్రగ్స్, లిక్కర్ పై మంగ్లీ ఫస్ట్ రియాక్షన్

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు

కోఆర్డినేషన్ కమిటీ వేయడాన్ని అభినందిస్తున్నాం : డా.ప్రతాని రామకృష్ణ గౌడ్

Gopichand's 33: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో హిస్టారికల్ ఫిల్మ్

Pawn kalyan: ఆర్థిక ఇబ్బందులు, ఓటీటీ రూల్స్ వల్లే హరిహరవీరలమల్లు ఆలస్యం అవుతుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments