Webdunia - Bharat's app for daily news and videos

Install App

12 ఏళ్ల బాలికపై అఘాయిత్యం.. ఆపై చెట్టుకు ఉరేశారు..

Webdunia
బుధవారం, 4 ఆగస్టు 2021 (12:23 IST)
మహిళలపై అఘాయిత్యాలు రోజు రోజుకీ పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా మధ్యప్రదేశ్‌లో 12 ఏళ్ల బాలికపై లైంగిక దాడి జరిగింది. ఆమెపై అఘాయిత్యానికి పాల్పడిన దుండగులు.. అనంతరం చెట్టుకు ఉరేశారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని విదిషా జిల్లాలో మంగళవారం చోటుచేసుకుంది.
 
వివరాల్లోకి వెళ్తే.. మంగళవారం ఉదయం 11 గంటల సమయంలో బాలిక తల్లి సమీప అడవిలోకి వెళ్లింది. తల్లిని అనుసరిస్తూ బాలిక కూడా వెళ్లింది. అయితే తల్లి ఇంటికి తిరిగి వచ్చేసరికి చిన్నారి కనిపించలేదు. దీంతో తమ బిడ్డ తప్పిపోయిందని గ్రామస్తులకు తల్లిదండ్రులు తెలిపారు. కొన్ని గంటల పాటు అడవిలో ఆ బిడ్డ కోసం గాలింపు చేశారు. చివరకు ఓ చెట్టుకు బాలిక వేలాడుతూ ఉండటాన్ని చూసి గ్రామస్తులు షాక్ అయ్యారు. ఆమె చేతులు కట్టేసి ఉంచారు.
 
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మైనర్‌పై లైంగికదాడికి పాల్పడి ఉరేసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘటనకు సంబంధించి ఓ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బాలికపై సామూహిక అత్యాచారం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం