Webdunia - Bharat's app for daily news and videos

Install App

12 ఏళ్ల బాలికపై అఘాయిత్యం.. ఆపై చెట్టుకు ఉరేశారు..

Webdunia
బుధవారం, 4 ఆగస్టు 2021 (12:23 IST)
మహిళలపై అఘాయిత్యాలు రోజు రోజుకీ పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా మధ్యప్రదేశ్‌లో 12 ఏళ్ల బాలికపై లైంగిక దాడి జరిగింది. ఆమెపై అఘాయిత్యానికి పాల్పడిన దుండగులు.. అనంతరం చెట్టుకు ఉరేశారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని విదిషా జిల్లాలో మంగళవారం చోటుచేసుకుంది.
 
వివరాల్లోకి వెళ్తే.. మంగళవారం ఉదయం 11 గంటల సమయంలో బాలిక తల్లి సమీప అడవిలోకి వెళ్లింది. తల్లిని అనుసరిస్తూ బాలిక కూడా వెళ్లింది. అయితే తల్లి ఇంటికి తిరిగి వచ్చేసరికి చిన్నారి కనిపించలేదు. దీంతో తమ బిడ్డ తప్పిపోయిందని గ్రామస్తులకు తల్లిదండ్రులు తెలిపారు. కొన్ని గంటల పాటు అడవిలో ఆ బిడ్డ కోసం గాలింపు చేశారు. చివరకు ఓ చెట్టుకు బాలిక వేలాడుతూ ఉండటాన్ని చూసి గ్రామస్తులు షాక్ అయ్యారు. ఆమె చేతులు కట్టేసి ఉంచారు.
 
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మైనర్‌పై లైంగికదాడికి పాల్పడి ఉరేసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘటనకు సంబంధించి ఓ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బాలికపై సామూహిక అత్యాచారం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం