Webdunia - Bharat's app for daily news and videos

Install App

కర్నాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. 12 మంది ఆంధ్రా వాసుల మృత్యువాత

Webdunia
గురువారం, 26 అక్టోబరు 2023 (12:00 IST)
కర్నాటక రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 12 మంది ఆంధ్రావాసులు మృత్యువాతపడ్డారు. ఈ రాష్ట్రంలోని చిక్‌బళ్ళాపూర్ సమీపంలో రోడ్డుపై ఆగివున్న ట్యాంకర్ లారీని టాటా సుమో అమిత వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 12 మంది వలస కూలీలు మృత్యువాతపడ్డారు. గాయపడిన వారిలో మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ వరస కూలీలంతా శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలానికి చెందిన వారిగా గుర్తించారు. 
 
దసరా పండుగకు కూలీలంతా సొంతూళ్లకు వచ్చారు. పండుగను ఎంతో సంతోషంగా జరుపుకున్న వారంతా తిరిగి కూలీ పనులకు బెంగుళూరులోని హోంగసంద్రకు వెళుతుండగా తిరిగి రాని లోకాలకు చేరుకున్నారు. గురువారం తెల్లవారుజామున పొగమంచు దట్టంగా ఉండటంతో ముందు ఆగివున్న వాహనాలు కనిపించలేదు. దీంతో డ్రైవర్ నరసింహులు రోడ్డుపై ఆగివున్న ట్యాంకర్ లారీని ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో సుమోలో ఉన్న 14 మందిలో ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో ఏడుగురు చిక్‌బళ్లాపూర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తమన్నా భాటియాకు కష్టాలు- ఐదు గంటల పాటు ఈడీ విచారణ.. ఎందుకు? (video)

రాధికా ఆప్టే బేబీ బంప్ ఫోటోలు వైరల్

80 కిలోలు ఎత్తిన రకుల్ ప్రీత్ సింగ్, వెన్నెముకకు గాయం

ఆకాశంలో పొట్టేల్ ప్రమోషన్.. పాంప్లేట్లు పంచారు.. (video)

కాగింతపై రాసిచ్చిన దాన్ని తెరపై నటిగా ఆవిష్కరించా : నటి నిత్యామీనన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే అల్లం నీటిని తాగితే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు

వరల్డ్ ట్రామా డే : ట్రామా అంటే ఏమిటి? చరిత్ర - ప్రాముఖ్యత

మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఏ సమస్యకు ఎలాంటి టీ తాగితే ప్రయోజనం?

గుంటూరు లోని ఒమేగా హాస్పిటల్‌లో నూతన కొలొస్టమి కేర్ క్లినిక్, పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments