Webdunia - Bharat's app for daily news and videos

Install App

కళ్యాణ మండపంలో వధూవరులపై యాసిడ్ దాడి

Webdunia
గురువారం, 20 ఏప్రియల్ 2023 (12:56 IST)
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ఘోరం జరిగింది. కళ్యాణ మండపంలో నూతన వధూవరులపై ఈ యాసిడ్ దాడి జరిగింది. వధూవరులపై గుర్తు తెలియని వ్యక్తులు ఈ దాడి చేసి పారిపోయారు. ఈ దాడిలో వధువు, వరుడు, ఇద్దరు పిల్లతో పాటు మొత్తం 12 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారందరినీ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు. 
 
పెళ్లి వేడుకలో కరెంట్ పోయిన సమయంలో ఈ దాడి జరగడంతో ఎవరు దాడి చేశారన్న దానిపై క్లారిటీ లేదు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి యాసిడ్ దాడి చేసిన వ్యక్తుల ఆచూకీ కోసం గాలిస్తున్నారు. భాన్‌పురి పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 
 
పోలీసుల కథనం మేరకు.. బస్తర్ జిల్లాలోని ఛోటే అమాబల్ గ్రామంలో సుధాపాల్ నివాసి దమ్రు బాఘేల్ (23), సునీత్ కశ్యప్ (19)లకు పెద్దలు పెళ్లి నిశ్చయించడంతో వారి వివాహం ఘనంగా జరుగుతుంది. ఇందులో కరెంట్ పోవడంతో కళ్యాణ మండలంలో అంధకారం నెలకొంది. ఇదే అదునుగా భావించిన గుర్తు తెలియని వ్యక్తులు వధూవరులపై యాసిడ్ దాడి చేశారు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ సినిమాకు టిక్కెట్ రేట్లు పెంచండి... ఏఎం రత్నం వినతి

హరిహరవీరమల్లు టికెట్ ధర ఆమోదం కోరుతూ ఛాంబర్ కి అభ్యర్థన

Ali: రాజేంద్రప్రసాద్ గారు సరదాగా మాట తూలారు : అలీ స్పందన

పెళ్లి పుస్తకం నుంచి షష్టిపూర్తి వరకు ఎవరికీ దక్కనిది నాకు దక్కింది: డా. రాజేంద్ర ప్రసాద్

సాయి కుమార్ నటించిన చౌకీదార్ నుంచి నాన్న.. పాట విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments