Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజస్థాన్‌లో రెండు లారీలు ఢీ : 11 మంది దుర్మరణం

Webdunia
ఆదివారం, 1 ఫిబ్రవరి 2015 (10:49 IST)
రాజస్థాన్ రాష్ట్రంలో ఆదివారం దారుణమైన రోడ్డు ప్రమాదం సంభవించింది. జోధ్‌పూర్ హైవే మీద వెళుతున్న రెండు లారీలు అదుపుతప్పి ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 11 మంది సంఘటనా స్థలంలోనే మృతి చెందగా, మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. అనంతరం క్షతగాత్రులను సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 
 
కాగా ఆస్పత్రిలో వైద్యం పొందుతున్న వారిలో మరికొంత మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు. మృతదేహలను పోలీసులు స్వాధీనం చేసుకుని పోస్ట్మార్టం నిమిత్తం జోధ్పూర్ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వేకువజామున ఒక లారీ డ్రైవర్ కునుకు కారణంగానే ప్రమాదం సంభవించినట్టు పోలీసుల ప్రాధమిక విచారణలో తెలిసింది. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments