Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముంబై చెంబూరులో విషాదం : కొండ చరియలు విరిగిపడి 11 మంది మృతి

Webdunia
ఆదివారం, 18 జులై 2021 (09:14 IST)
మహారాష్ట్ర రాజధాని ముంబైలోని చెంబూరులో విషాదం చోటుచేసుకుంది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కొండచరియలు విరిగి ఇళ్లపై పడడంతో 11 మంది ప్రాణాలు మృత్యువాతపడ్డారు. 
 
భారీ వర్షాల కారణంగా విరిగిపడిన కొండచరియలు స్థానిక భరత్‌నగర్ ప్రాంతంలోని ఇళ్లపై పడ్డాయి. దీంతో ఆ ఇళ్లలో నివసిస్తున్న 11 మంది మృతి చెందారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న ఎన్డీఆర్ఎఫ్ దళాలు శిథిలాల నుంచి 16 మందిని రక్షించాయి. 
 
శిథిలాల కింద గాలింపు చర్యలు కొనసాగుతున్నట్టు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో 5 ఇళ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. శిథిలాల కింద మరో 8 మంది చిక్కుకుని ఉంటారని భావిస్తున్నారు. 
 
కాగా, ముంబైలోని విక్రోలీ ప్రాంతంలో ఓ భవనం కూలిన ఘటనలో ముగ్గురు మృతి చెందారు. ఇక్కడ కూడా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments