Webdunia - Bharat's app for daily news and videos

Install App

వందేళ్ళ నాటి మర్రి చెట్టుకు విషమిచ్చి చంపారు... ఎందుకో తెలుసా?

సాధారణంగా మనుషులకు, జంతువులను చంపేందుకు విష ప్రయోగం చేస్తుంటారు. కానీ, ఇక్కడ ఓ చెట్టును నరికివేసేందుకు విషమిచ్చారు. తమిళనాడు రాష్ట్ర రాజధాని పెరుంగుడికి సమీపంలో ఇది జరిగింది.

Webdunia
గురువారం, 28 జులై 2016 (13:56 IST)
సాధారణంగా మనుషులకు, జంతువులను చంపేందుకు విష ప్రయోగం చేస్తుంటారు. కానీ, ఇక్కడ ఓ చెట్టును నరికివేసేందుకు విషమిచ్చారు. తమిళనాడు రాష్ట్ర రాజధాని పెరుంగుడికి సమీపంలో ఇది జరిగింది. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ ఓ మొక్కను నాటాలని విస్తృతంగా ప్రచారం సాగుతోంది. కానీ, ఇక్కడ భారీ వృక్షం అడ్డు తొలగించుకునేందుకు విషమిచ్చి చంపినట్టు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
వందేళ్ళ వయసు గల ఓ మర్రి చెట్టు ఓ ఐటీ పార్కుకు ఎదురుగా ఉంది. దీన్ని అడ్డు తొలగించాలంటే నగర పాలక సంస్థ అనుమతి కావాలి. దీంతో ఈ మర్రి చెట్టు అడ్డును ఎలా తొలగించాలన్న అంశంపై ఐటీ కంపెనీ యాజమాన్యమే చెట్టుపై విషప్రయోగం చేసి చంపారని ఆ ప్రాంతవాసులు ఆరోపిస్తున్నారు. 
 
దాని వేళ్లలోకి మెర్క్యూరీని ఇంజెక్ట్ చేయటం ద్వారా అది ఎండిపోయేలా చేసి దానిని తొలగించాలని చూశారని వారి వాదన. ఇటీవల దానిని పరిశీలించిన నిపుణుల బృందం సైతం 'ఇంత తక్కువ సమయంలో ఆ చెట్టు ఇలా కావడం అనుమానాలకు తావిస్తుంది' అని తేల్చారు. ఇప్పటికే ఆ చెట్టు 80 శాతం ఎండిపోయిన కారణాన్ని చూపుతూ దాని భాగాలు చాలావరకు తొలగించారు. దీంతో హార్టీకల్చర్ నిపుణులు దీనిపై సమగ్రమైన విచారణ జరపాలని ఆ ప్రాంతవాసులు డిమాండ్ చేస్తూ న్యాయపోరాటానికి సిద్ధమవుతున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments