Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెండుగా విడిపోయిన లోహిత్ ఎక్స్‌ప్రెస్

Webdunia
గురువారం, 22 జూన్ 2023 (08:32 IST)
ఇటీవలికాలంలో వరుస రైలు ప్రమాద ఘటనలో వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా, ఈ రాష్ట్రంలోని బాలాసోర్ సమీపంలోని బహనగ బజాప్ వద్ద కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ఘోర ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో 292 మంది ప్రాణాలు కోల్పోయారు. వెయ్యి మందికి పైగా గాయపడ్డారు. ఈ ప్రమాదంపై సీబీఐ దర్యాప్తు సాగుతోంది. ఆ తర్వాత అనేక ప్రాంతాల్లో వరుస రైలు ప్రమాద ఘటనలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా, గూడ్సు రైళ్లు పట్టాలు తప్పుతున్నాయి. తాజాగా లోహిత్ ఎక్స్‌ప్రెస్ రెండుగా విడిపోయింది. 
 
కటిహార్‌ జిల్లాలో గౌహతి నుంచి జమ్మూకు వెళ్లే లోహిత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ఒక్కసారిగా రెండు భాగాలుగా విడిపోయింది. ఇంజిను నుంచి సుమారు 10 బోగీలు విడిపోగా.. మిగిలిన రైలు మాత్రం కొంతదూరం అలాగే పరుగులు తీసింది. బిహార్‌ - బెంగాల్‌ సరిహద్దులోని నార్త్‌ దినాజ్‌పుర్‌ జిల్లాలో ఉన్న దల్ఖోలా స్టేషను సమీపంలో మంగళవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. చాలామంది ప్రయాణికులు ప్రాణభయంతో కిందికి దూకేశారు. ఆ మార్గంలో రైళ్ల రాకపోకలను కాసేపు నిలిపివేసి, రెండు భాగాలను జత చేశాక రైలు మళ్లీ అక్కడ నుంచి బయలుదేరి వెళ్లింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పారితోషికం కంటే పనిలో సంతృప్తి కి ప్రాధాన్యత: కిషోర్ బొయిదాపు

Nitin: సోదరి సెంటిమెంట్ తమ్ముడు మూవీకి ఎ సర్టిఫికెట్ కావాలన్న దిల్ రాజు

అప్పుడు బొమ్మరిల్లు ఇప్పుడు 3 BHK, అందుకే కె విశ్వనాథ్ గారికి అంకితం: సిద్ధార్థ్

ఆలయానికి మరో ఏనుగును విరాళంగా ఇచ్చిన నటి త్రిష

'కాంటా లగా' ఫేమ్ షఫాలీ జరివాలా హఠాన్మరణం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments