Webdunia - Bharat's app for daily news and videos

Install App

మొటిమలు, మచ్చలకు "మామిడి పండు"తో గుడ్‌బై..!!

Webdunia
శుక్రవారం, 11 ఏప్రియల్ 2014 (18:40 IST)
File
FILE
ఊరించే రంగుతో, కమ్మనైన రుచితో.. నోరంతా తీపి చేసే మామిడి పండు ఆరోగ్య ప్రదాయినే కాదు, సౌందర్య సంరక్షిణి కూడా. మొటిమలు, మచ్చలతో బాధపడేవారు ఐదు టీస్పూన్ల మామిడి పండు రసాన్ని తీసుకుని దాంట్లో ముప్పావు టీస్పూన్ పసుపు కలిపి మిశ్రమం తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి బాగా ఆరిన తరువాత మంచినీటితో శుభ్రం చేసుకుంటే మొటిమలు, మచ్చలను తొలగిస్తుంది. చర్మానికి మృదుత్వాన్నిస్తుంది. అయితే ఈ మామిడిపండు ప్యాక్‌ను కొన్ని వారాలపాటు క్రమం తప్పకుండా వాడటం మాత్రం మర్చిపోవద్దు.

వేసవిలో ఎక్కువగా వేధించే సమస్య చెమట, దాని నుంచి వచ్చే దుర్వాసన. దీనికి చెక్ పెట్టాలంటే.. స్నానం చేసే నీటిలో కాస్తం గ్లిజరిన్ వేస్తే సరి. అలాగే జిడ్డు వెంట్రుకలతో బాధపడేవారు ఓ కప్పు హెన్నా పొడిలో, పావుకప్పు కాఫీ గింజల పౌడర్, ఒక టీస్పూనే వెనిగర్‌ల‌ను తీసుకుని వాటికి వేడినీరు కలుపుతూ మిశ్రమం చేయాలి. దీనిని నిద్రపోయేందుకు ముందుగా జుట్టుకు పట్టించి తలకు ప్లాస్టిక్ కవర్ చుట్టుకుని పడుకోవాలి. ఉదయాన్నే షాంపూతో తలస్నానం చేస్తే జిడ్డు పోవటమేగాకుండా, జట్టు అదో రకమైన రంగుతో మెరిసిపోతుంది.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments