ఆహారం లేకపోయినా మానవుడు కొన్ని గంటలు ఉండగలడేమోగానీ కనీస నిద్ర లేకపోతే మాత్రం నరకం అనుభవించినంత అనుభవానికి లోనవుతాడు. అంతేకాదు నిద్రలేమితో మేధస్సు మందగిస్తుంది. అందానికి ఆరోగ్యానికి కూడా హాని కలిగిస్తుంది. కనుక నిద్ర అనేది తప్పనిసరి.
* ముఖ్యంగా రోజుకు కనీసం ఆరు గంటల సమయం నిద్ర తప్పని సరిగ్గా ఉండాలి.
* మారేడు కషాయం రెండు స్పూన్ల చొప్పున రోజుకు నాలుగుసార్లు తీసుకుంటే మంచినిద్ర వస్తుంది.
* నిద్రలేమితో బాధపడేవారు బెడ్ మీద పడుకునే ముందు కొన్ని నిముషాల వరకూ మౌనంగా వుండి, గాఢమైన ఒక శ్వాసను పీల్చి, ఒకటి రెండు సెకండ్ల పాటు బిగపట్టి వదిలేయండి. నెమ్మదిగా ఈ పద్ధతిని కొన్నిసార్లు రిపీట్ చేస్తే మనసులో ఒక విధమైన ప్రశాంతత కలిగి క్రమంగా నిద్ర వస్తుంది