కావలసిన వస్తువులు... నిమ్మకాయలు - 4, ఉప్పు - సరిపడ. చక్కెర - 4 కప్పులు. నీరు - 3/4 కప్పు. మీకిష్టమైన రంగు - 1 స్పూన్. ఎస్సెన్స్ (మీకిష్టమైంది) - 1 స్పూన్
తయారు చేసే విధానం...
ముందుగా 2 కప్పుల పంచదారకు ముప్పావు కప్పు నీరు పోసి తీగ పాకం వచ్చేంత వరకు వేడి చేయాలి. అందువలో టీ స్పూన్ నిమ్మ ఉప్పు వేరే గిన్నెలో నీళ్ళు కలిపి, లేతపాకంలో పోసి 2, 3 సార్లు కలియబెట్టి దించాలి. నిమ్మ ఉప్పు వేయగానే పాకం నిమ్మ తొనల సువాసన వస్తుంది.
ఆ పాకంలో మిఠాయి రంగు వేసి బాగా కలిపి మూత పెట్టాలి. తర్వాత ఎస్సెన్స్ 2, 3 చుక్కలు వేసి కలిపి గట్టిగా మూత పెట్టాలి. కాస్త చల్లారిన తర్వాత పొడిగా ఉన్న సీసాల్లో భద్ర పరుచుకోవాలి. ఇంటికి అతిథులు వచ్చినపుడు ఇచ్చేటప్పుడు రెండు స్పూన్లు పాకాన్ని ఒక గ్లాసు నీళ్ళలో కలిపి సర్వ్ చేస్తే సూపర్.