తెలంగాణ ఎన్నికలు : ఎంపీగా రేవంత్ రెడ్డి విజయం

Webdunia
గురువారం, 23 మే 2019 (15:28 IST)
కాంగ్రెస్ తురుపుముక్క, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఏ. రేవంత్ రెడ్డి విజయం సాధించారు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తెలంగాణాలోని మల్కాజ్‌గిరి లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసిన రేవంత్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి తెరాసకు చెందిన రాజశేఖర్‌పై 6270 ఓట్ల తేడాతో విజయభేరీ మోగించారు. 
 
ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణా రాష్ట్రంలో ఇప్పటికే భువనగిరి, నల్గొండ స్థానాలను కైవసం చేసుకుంది. ఇపుడు రేవంత్ రెడ్డి కూడా విజయం సాధించారు. దీంతో ఇప్పటివరకు మొత్తం మూడు స్థానాల్లో గెలుపొందినట్టయింది. 
 
నిజానికి గురువారం ఉదయం నుంచి ప్రారంభమైన ఓట్ల లెక్కింపులో టీఆర్ఎస్ అభ్యర్థి .. అటు కాంగ్రెస్ అభ్యర్థి ఒక్కో రౌండ్‌లో ఒకరు ఆధిక్యంలో ఉంటూ వచ్చారు. దాంతో ఎవరిని విజయం వరిస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది. చివరికి కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డిని విజయం వరించడంతో, ఆయన అభిమాన గణం ఊపిరి పీల్చుకున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ఓడిపోయిన విషయం తెల్సిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Venky 77: వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో మల్లీశ్వరీ సీక్వెల్ !

Janhvi : రామ్ చరణ్, జాన్వీ కపూర్ పై పెద్ది కోసం పూణేలో సాంగ్ షూటింగ్

నాలుగు జన్మల కథతో మైథలాజికల్ చిత్రంగా గత వైభవ: ఎస్ఎస్ దుశ్యంత్

బాలీవుడ్ హీరోయిన్ శిల్పాశెట్టికి షాకిచ్చిన బాంబే హైకోర్టు

KRamp: ఫ్లవర్ లాంటి లవర్ ఉంటే లైఫ్ సూపర్ రా అంటూ K-ర్యాంప్ గీతం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దీపావళి డ్రెస్సింగ్, డెకర్: ఫ్యాబ్ఇండియా స్వర్నిమ్ 2025 కలెక్షన్‌

ధ్యానంతో అద్భుతమైన ప్రయోజనాలు

రష్మిక మందన్న, ప్రముఖ క్రియేటర్‌లతో జతకట్టిన క్రాక్స్

గ్యాస్ట్రిక్ సమస్యలు వున్నవారు ఎలాంటి పదార్థాలు తీసుకోకూడదు?

బొబ్బర్లు లేదా అలసందలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments