ప్రశాంతంగా సాగుతున్న లోక్‌సభ ఎన్నికల పోలింగ్!

వరుణ్
శుక్రవారం, 19 ఏప్రియల్ 2024 (17:07 IST)
దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల సమరంలో తొలి విడత పోలింగ్‌ శుక్రవారం ప్రశాంతంగా కొనసాగుతోంది. కొన్ని రాష్ట్రాల్లో అల్లర్ల వంటి చెదురుమదురు ఘటనలు చోటు చేసుకున్నాయి. మొదటివిడతలో 21 రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 స్థానాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఈ ఎన్నికల్లో మధ్యాహ్నం 3 గంటల వరకు 49.78 శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల కమిషన్‌ వెల్లడించింది.
 
అత్యధికంగా ఈశాన్య రాష్ట్రం త్రిపురలో 68.35 శాతం పోలింగ్‌ నమోదైంది. ఆ తర్వాత మణిపూర్‌ 63 శాతం, మేఘాలయలో 61 శాతం, అస్సాంలో 60 శాతం మంది ఓటర్లు ఇప్పటివరకు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అత్యల్పంగా బీహార్‌లో 39.78 శాతం పోలింగ్‌ నమోదైంది. లోక్‌సభ స్థానాలతో పాటు అరుణాచల్‌ ప్రదేశ్‌, సిక్కింలోని శాసనసభ స్థానాలకు నేడు ఎన్నికలు జరుగుతున్నాయి. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ కొనసాగనుంది.
 
ఆయా రాష్ట్రాల్లో తొలి గంటల్లోనే పలువురు ప్రముఖులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. వృద్ధులు, కొత్త జంటలు ఓటు వేసి పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. బెంగాల్‌లో కొన్నిచోట్ల టీఎంసీ, భాజపా వర్గాల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. మణిపుర్‌లో ఓ పోలింగ్‌ కేంద్రం వద్ద కాల్పుల శబ్దాలు కలకలం సృష్టించాయి. 
 
న్యాయం కోసం పోరాడుతున్నాం.. షర్మిలను గెలిపించండి : సునీత 
 
తన తండ్రి, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డిని వారిని దోషులుగా నిలబెట్టాలని, మా తండ్రి హత్య కేసులో న్యాయం కోసం పోరాటం చేస్తున్నామని వివేకానంద రెడ్డి కుమార్తె సునీతా తెలిపారు. పైగా, కడప లోక్‌సభ బరిలో నిలిచిన వైఎస్ షర్మిలను గెలిపించాలని ఆమె కడప జిల్లా ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి వివేకా హత్య కేసుపై వ్యాఖ్యలు చేయొద్దని కడప జిల్లా కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై ఆమె స్పందించారు. దీన్ని సవాల్‌ చేస్తూ హైకోర్టును ఆశ్రయించనున్నట్లు తెలిపారు. 'న్యాయం కోసం ప్రజాతీర్పు కోరుతుంటే వైకాపా అడ్డుపడుతోంది. పులివెందులలో నేను ప్రచారం చేయకుండా కేసులు వేస్తున్నారు. వివేకా హత్య అంశంపై వైకాపా నేతలు చాలాసార్లు మాట్లాడారు. మీ ఇళ్ల వద్దకు నేను రాలేకపోతే మన్నించండి. ఎన్నికల్లో షర్మిలను గెలిపించే బాధ్యత ప్రజలదే' అని ఆమె పేర్కొన్నారు. 
 
వివేకా హత్యకేసు అంశంపై వైఎస్‌ షర్మిల, వివేకా కుమార్తె సునీత, చంద్రబాబు నాయుడు, లోకేశ్‌, పురంధేశ్వరి, పవన్‌ కల్యాణ్‌, పులివెందుల తెదేపా అభ్యర్థి బీటెక్‌ రవి తరచూ మాట్లాడుతున్నారని, వారు ఈ వ్యాఖ్యలు చేయకుండా చూడాలని వైకాపా వైఎస్‌ఆర్‌ జిల్లా అధ్యక్షుడు సురేష్‌బాబు కడప కోర్టులో పిటిషన్‌ వేశారు. ప్రతివాదులు, వారి అనుచరులు, ఆయా పార్టీల అభ్యర్థులు ఈ కేసులో అవినాష్‌రెడ్డిని హంతకుడిగానూ, సీఎం జగన్‌ ఆయన్ను కాపాడుతున్నట్లుగానూ వ్యాఖ్యానిస్తున్నారన్నారు. ఇలా వారి ప్రతిష్ఠకు భంగం కలిగించేవి, వ్యాఖ్యలు చేయరాదని కోర్టు గురువారం ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 30కు వాయిదా వేస్తూ కడప జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.శ్రీదేవి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ సినిమాలో విలన్ పాత్ర కోసం సంప్రదించి.. రూ.3 కోట్లు ఆఫర్ చేశారు : మల్లారెడ్డి

Avika Gor: మిలింద్ తో పెండ్లి సమయంలో అవికా గోర్ కన్నీళ్ళుపెట్టుకుంది

Vijay Deverakonda: అందుకే సత్యసాయి బాబా మహా సమాధిని విజయ్ దేవరకొండ సందర్శించారా

Baahubali 3: బాహుబలి-3 రాబోతోందా? రాజమౌళి ప్లాన్ ఏంటి?

హీరో విజయ్ ఓ జోకర్... శృతిహాసన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొబ్బర్లు లేదా అలసందలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

వర్షా కాలంలో జామ ఆకుల టీ తాగితే?

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments