రాజకీయ నాయకులారా.. దయచేసి మా ఊరికి మాత్రం రావద్దు..!

Webdunia
మంగళవారం, 26 మార్చి 2019 (18:04 IST)
ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఇప్పటివరకు మా గ్రామంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, ఈసారి ఎన్నికల్లో పాల్గొనదలచుకోలేదని చిత్తూరు జిల్లా తొట్టంబేడు మండలంలోని గుర్రప్పనాయుడుకండ్రిగ గ్రామస్తులు సోమవారం గోడలకు పోస్టర్లు అంటించారు.


ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ ఏ రాజకీయ నాయకులు, కార్యకర్తలు ఎన్నికల ప్రచారం కోసం తమ గ్రామానికి రావద్దని సూచించారు. గ్రామంలో ప్రధాన రోడ్డు సౌకర్యం లేదన్నారు. వంతెన నిర్మించాలన్నారు. పంచాయితీలో తాగునీటి సమస్య కూడా ఉందంటూ వాపోయారు.
 
వీధిలైట్లు సక్రమంగా వెలగలేదన్నారు. గతంలో ఎన్నోసార్లు జన్మభూమి–మాఊరు కార్యక్రమంలో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. తాము ఇచ్చిన అర్జీలు చెత్తకుండీలో వేసారని, తమ గ్రామానికి అభివృద్ధి చేయకుంటే తాము ఎందుకు ఓట్లు వేయాలని ప్రశ్నించారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ సుధాకర్ గ్రామానికి వెళ్లి గ్రామస్తులతో మాట్లాడారు.
 
మంగళవారం ఎన్నికల అధికారులతో సమావేశం ఏర్పాటు చేస్తామని ఎస్‌ఐ హామీ ఇచ్చారు. గోడలపై ఇలాంటి పోస్టర్లు అంటించకూడదన్నారు. గతంలో ప్రజాప్రతినిధులుగా ఉన్న వారు గ్రామాల అభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకోలేదని, అలాగే రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయంటూ ప్రజలు అంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tandavam song: ఓం నమహ్ శివాయ.. అఖండ తాండవం సాంగ్ రిలీజ్

సత్య, రితేష్ రానా.. జెట్లీ హ్యూమరస్ టైటిల్ పోస్టర్ రిలీజ్

మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ విడుదల చేస్తున్న ఇట్లు మీ ఎదవ

తల్లి తో అవార్డ్ అందుకున్న మధుర క్షణాల్లో సాయి దుర్గ తేజ్

Balakrishna: అఖండ 2 కోసం ముంబై చేరిన బాలకృష్ణ, బోయపాటిశ్రీను

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

ఇమామి లిమిటెడ్ వ్యూహాత్మక కేశ్ కింగ్ రీ బ్రాండింగ్

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments