Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజకీయ నాయకులారా.. దయచేసి మా ఊరికి మాత్రం రావద్దు..!

Webdunia
మంగళవారం, 26 మార్చి 2019 (18:04 IST)
ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఇప్పటివరకు మా గ్రామంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, ఈసారి ఎన్నికల్లో పాల్గొనదలచుకోలేదని చిత్తూరు జిల్లా తొట్టంబేడు మండలంలోని గుర్రప్పనాయుడుకండ్రిగ గ్రామస్తులు సోమవారం గోడలకు పోస్టర్లు అంటించారు.


ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ ఏ రాజకీయ నాయకులు, కార్యకర్తలు ఎన్నికల ప్రచారం కోసం తమ గ్రామానికి రావద్దని సూచించారు. గ్రామంలో ప్రధాన రోడ్డు సౌకర్యం లేదన్నారు. వంతెన నిర్మించాలన్నారు. పంచాయితీలో తాగునీటి సమస్య కూడా ఉందంటూ వాపోయారు.
 
వీధిలైట్లు సక్రమంగా వెలగలేదన్నారు. గతంలో ఎన్నోసార్లు జన్మభూమి–మాఊరు కార్యక్రమంలో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. తాము ఇచ్చిన అర్జీలు చెత్తకుండీలో వేసారని, తమ గ్రామానికి అభివృద్ధి చేయకుంటే తాము ఎందుకు ఓట్లు వేయాలని ప్రశ్నించారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ సుధాకర్ గ్రామానికి వెళ్లి గ్రామస్తులతో మాట్లాడారు.
 
మంగళవారం ఎన్నికల అధికారులతో సమావేశం ఏర్పాటు చేస్తామని ఎస్‌ఐ హామీ ఇచ్చారు. గోడలపై ఇలాంటి పోస్టర్లు అంటించకూడదన్నారు. గతంలో ప్రజాప్రతినిధులుగా ఉన్న వారు గ్రామాల అభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకోలేదని, అలాగే రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయంటూ ప్రజలు అంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

Kavya Kalyan Ram: గ్లామ‌ర‌స్ చిత్రాలలో నటించేందుకు సిద్ధమైన కావ్య క‌ళ్యాణ్ రామ్‌

కంటెంట్ ఈజ్ కింగ్ అని వైల్డ్ బ్రీత్ సినిమా ప్రూవ్ చేస్తుంది - శివాజీ రాజా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

How to Use Hair Oil: మహిళలు జుట్టుకు నూనె ఎలా రాసుకోవాలో తెలుసా?

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తర్వాతి కథనం
Show comments