Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్య గురించి పట్టించుకోని వ్యక్తి.. గుంజీలు తీయాలి.. మోదీకి దీదీ సవాల్

Webdunia
శుక్రవారం, 10 మే 2019 (16:26 IST)
సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీల మధ్య మాటల యుద్ధం సాగిన సంగతి తెలిసిందే. ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రచారం పేరుతో తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. ఈ క్రమంలో ప్రధానికి ప్రజాస్వామ్యం చెంపదెబ్బేంటో రుచి చూపిస్తామని దీదీ వ్యాఖ్యానించారు. 
 
ఈ వ్యాఖ్యలపై  ప్రధాని స్పందించారు. మమతా బెనర్జీని తాను సోదరిలా భావిస్తానని చెప్పుకొచ్చారు. దీదీ కొట్టే చెంపదెబ్బ తనకు దీవెనగా మారుతుందని మోదీ కామెంట్స్ చేశారు. తనను చెంపదెబ్బ కొట్టిన ఫర్వాలేదని, అంతకంటే ముందు పేదలను మోసం చేసిన చిట్‌ఫండ్ కంపెనీలపై చర్యలు తీసుకుంటే బాగుండేదని హితవు పలికారు. 
 
ఇక, మోదీ టార్గెట్‌గా దీదీ మరోసారి చెలరేగిపోయారు. బొగ్గు మాఫియాలో టీఎంసీ అభ్యర్థులు ఎవరైనా ఉంటే రుజువు చేయాలని మోదీకి సవాల్ విసిరారు. రుజువు చేయలేక పోతే, చెవి పట్టుకొని వంద గుంజీలు తీయాలని సవాల్ చేశారు. భార్య గురించి పట్టించుకోని వ్యక్తికి ప్రజల సంక్షేమం గురించి ఏం తెలుస్తుందని ఎద్దేవా చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగు సినిమా పుట్టిన రోజుగా కీలక నిర్ణయాలు తీసుకున్న ఫిల్మ్ చాంబర్

ఓ వ్యక్తితో కలిసివుంటూ అతని కొడుకుతో ప్రేమలోపడిన సిల్క్‌ స్మిత!!

Shekar Basha- జానీ మాస్టర్ తర్వాత శేఖర్ బాషాపై శ్రేష్టి వర్మ ఫిర్యాదు.. ప్రైవేట్ కాల్ రికార్డింగ్‌లను?

Thiruveer : మసూద తర్వాత సెలెక్టివ్‌గా కథల్ని ఎంచుకుంటున్నా: తిరువీర్

రానా నాయుడు 2, టెస్ట్ తో అలరించేందుకు రెడీ అయిన నెట్ ఫ్లిక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో జలుబు, ఈ చిట్కాలతో చెక్

ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రకు ఉపక్రమించే దాకా

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్ భారీ అవగాహన కార్యక్రమం

క్యాన్సర్ వ్యాధిని తగ్గించగల 8 ఆహారాలు

పిల్లల కడుపుకు మేలు చేసే శొంఠి.. ఎలాగంటే..?

తర్వాతి కథనం
Show comments