Webdunia - Bharat's app for daily news and videos

Install App

తల్లిదండ్రులు ఓటేస్తే విద్యార్థులకు బంపర్ ఆఫర్..!

Webdunia
బుధవారం, 10 ఏప్రియల్ 2019 (10:40 IST)
ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజకీయ నాయకులు ఓటర్లకు తాము అధికారంలోకి వస్తే చేయబోయే పనుల గురించి హామీలు, వరాలు ఇస్తుంటారు. సరిగ్గా ఓ కాలేజీ కూడా ఇలాగే వరం ఇచ్చింది. అయితే ఇక్కడ విచిత్రమేమిటంటే ఆ వరం ఇచ్చింది ఓటర్లకు కాదు... ఆ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు. 
 
'తల్లిదండ్రులు ఓటేస్తే పిల్లలకు పది మార్కులు ఎక్కువ కలుపుతాం' అంటూ హామీ ఇచ్చింది. అయితే ఆ కాలేజీ ఉన్నది మాత్రం ఇక్కడ కాదు.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో.. లక్నోలోని క్రైస్ట్ చర్చి కాలేజీ విద్యార్థుల తల్లిదండ్రులు ఓటేస్తే.. విద్యార్థుల ఫైనల్ రిజల్ట్‌లో పది మార్కులు కలుపుతామని ఆ స్కూలు ప్రిన్సిపాల్ ఆర్కే ఛత్రీ హామీ ఇచ్చారు. చెప్పడమే కాదు గేటుకు పెద్ద బ్యానర్ కూడా కట్టారు.
 
ఈ ప్రజాస్వామ్యంలో ఓటు ఒక ఆయుధం. భావి తరాల భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉందంటూ, విద్యార్థుల తల్లిదండ్రులందరికీ మా విన్నపం ఏంటంటే అందరూ ఓటేయండి. ఓటు వేసిన వారి పిల్లలకు ఫైనల్ రిజల్ట్‌లో పది మార్కులు అదనంగా కలుపుతాం” అని ఆ బ్యానర్‌లో వివరించారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments