Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రచారంలో కేఏ పాల్ చైన్ కొట్టేశారు..

Webdunia
గురువారం, 28 మార్చి 2019 (11:41 IST)
ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో కేఏ పాల్ ఇతర రాజకీయ పార్టీలకు కొరకరాని కొయ్యగా మారాడు. తాజాగా వైసీపీ అభ్యర్థుల పేర్లను పోలిన ఇతరులతో తన ప్రజాశాంతి పార్టీ టిక్కెట్‌పై నామినేషన్‌లు వేసేలా చేసి వైసీపీకి చుక్కలు చూపిస్తున్నాడు. మరోవైపు తన ఎన్నికల గుర్తు, జెండా కూడా వైసీపీని పోలి ఉండడంతో వారికి పాల్ ఇప్పుడు తలనొప్పిగా మారాడు. 
 
ఇప్పటివరకు అందరూ పాల్‌పై జోకరు ముద్ర వేసారు. అయితే సీన్ ఇప్పుడు ఒక్కసారిగా మారిపోయింది, అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ తన ప్రచారాన్ని మరింత వేగవంతం చేసాడు. రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేస్తూ.. తానే ఏపీకి కాబోయే మ్నుఖ్యమంత్రిని అంటూ పాల్ ప్రచారం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఆయనకు అనుకోని సంఘటన ఎదురైంది. 
 
ఆయన గోల్డ్ చైన్ ఎవరో కొట్టేశారు. ప్రచారంలో భాగంగా ప్రజాశాంతి పార్టీ కార్యకర్తలతో మాట్లాడుతున్న తరుణంలో ఆయన వేసుకున్న దండలు తీసే ముసుగులో ఆయన చైన్ కూడా నొక్కేసినట్టు ప్రచారం జరుగుతోంది. అయితే కేఏ పాల్ దీనిపై ఎలాంటి ఫిర్యాదు చేయలేదని సమాచారం.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments