Webdunia - Bharat's app for daily news and videos

Install App

బలహీన ప్రధాని... నిలదీస్తే పాకిస్థాన్ గురించి మాట్లాడుతారు : ప్రియాంకా

Webdunia
ఆదివారం, 21 ఏప్రియల్ 2019 (11:45 IST)
కేంద్రంలో ఉన్న ఇలాంటి బలహీన ప్రభుత్వం, బలహీన ప్రధానిని ఇదివరకెన్నడూ తాను చూడలేదని.. ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకోవడంలో ప్రస్తుత ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీజేపీని, ప్రధాని నరేంద్ర మోడీని ఉద్దేశిస్తూ తూర్పు ఉత్తర్‌ప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ ప్రియాంకా గాంధీ వాద్రా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 
 
ఆమె సోదరుడు, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పోటీ చేస్తున్న కేరళలోని వయనాడ్ జిల్లాలోని పూలపల్లిలో ప్రియాంక శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వయనాడ్ సోదరీమణులు మరియు సోదరులారా.. నేను ఇప్పుడున్న ప్రభుత్వంలాంటి బలహీన ప్రభుత్వాన్ని, ఇప్పుడున్న ప్రధాని వంటి బలహీన ప్రధానిని గతంలో ఎన్నడూ చూడలేదు. 
 
ప్రజల కోసం పాటుపడే ప్రభుత్వం ఇప్పుడు మీకు కావాలి. ప్రభుత్వానికి వ్యతిరేకమైనప్పటికీ.. ప్రజల గొంతుకను వినిపించేందుకు అవకాశమిచ్చే ప్రభుత్వం ఇప్పుడు రావాలి. ప్రజలను గౌరవిస్తూ.. చేసిన వాగ్దానాలను నిలుపుకునే ప్రధాని ఇప్పుడు మీకు అవసరం అని వ్యాఖ్యానించారు. ప్రజల్ని విడగొట్టాలని వాళ్ళు(బీజేపీ) ప్రయత్నిస్తున్నారు. తమ కష్టాలను చెప్పుకోవడానికి దేశం నలుమూలల నుంచి రైతులు మీ దగ్గరకు (ఢిల్లీకి) వస్తే, వాళ్ళ విన్నపాలను వినిపించుకోకుండా తరిమికొట్టారని దుయ్యబట్టారు.
 
మీ ప్రభుత్వాన్ని, మీ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ నిరసనలు తెలియజేసిన ప్రజలపై దాడి చేసి, జైల్లో పెట్టారు. దీన్ని జాతీయవాదం అంటారా? అంటూ ప్రియాంక నిప్పులు చెరిగారు. ఎన్నికల ప్రచారంలో పాకిస్థాన్ గురించి మాట్లాడుతారు తప్ప, ప్రజలకు ఏం చేస్తారు? ఇచ్చిన వాగ్దానాలను ఎంత వరకు నెరవేర్చారు అనే విషయాలను చెప్పరని బీజేపీ నేతలను ఉద్దేశిస్తూ ఆమె ఎద్దేవా చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ ప్రభుత్వం ప్రజలను నిలువునా మోసం చేసిందని ఆరోపించారు. గత ఐదేండ్లలో బీజేపీ ప్రభుత్వం చేసిందల్లా దేశాన్ని ముక్కలు చేయడమేనన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులపై స్పందించిన విజయ్ దేవరకొండ

Rashmika: విజయ్ దేవరకొండ ఇంట్లో ఫోటో షూట్ చేసిన రష్మిక- ఆ చీరను ఎవరిచ్చారు?

బీఎన్‌ రెడ్డి పురస్కారం ఎంతో గౌరవంగా భావిస్తున్నాను: దర్శకుడు సుకుమార్‌

సైనిక అధికారులకు కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రదానోత్సవం

కమెడియన్‌ ప్రవీణ్‌ బకాసుర రెస్టారెంట్‌ నుంచి జాతీయం లిరికల్‌ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments