Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశ వ్యాప్తంగా ఫైనల్ పోలింగ్ ప్రారంభం... కట్టుదిట్టమైన భద్రత

Webdunia
ఆదివారం, 19 మే 2019 (07:45 IST)
సార్వత్రిక ఎన్నికల్లో భాగం తుది దశ పోలింగ్‌లో ఆదివారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పోటీచేస్తున్న వారణాసి సహా దేశంలోని ఏడు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతమైన చండీగఢ్‌లలో విస్తరించిన 59 లోక్‌సభ సీట్లకు పోలింగ్ జరుగుతోంది. ఈ నియోజకవర్గాల్లోని 10,01,75,153ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 
 
ఈ దశలో ఉత్తరప్రదేశ్‌లోని 13 లోక్‌సభ స్థానాలకు, పంజాబ్‌లోని 13, పశ్చిమ బెంగాల్‌లోని 9, మధ్యప్రదేశ్‌లోని 8, బీహార్‌లోని 8, హిమాచల్‌ప్రదేశ్‌లోని 4, జార్ఖండ్‌లోని 3, చండీగఢ్ కేంద్రపాలిత ప్రాంతం లోక్‌సభ స్థానానికి పోలింగ్ జరుగుతోంది. ఈ స్థానాల నుంచి 918 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. 
 
పశ్చిమబెంగాల్‌లో హింసాత్మక ఘటనల నేపథ్యంలో అదనపు బలగాలను మోహరింపజేశారు. ఆదివారం జరిగే పోలింగ్‌తో కలిపితే దేశంలో 542 నియోజకవర్గాలకు పోలింగ్‌ ముగిసినట్లవుతుంది. చివరి దశ పోలింగ్‌ సందర్భంగా దేశంలోని అందరి కళ్లూ వారణాసి నియోజకవర్గంపైనే ఉన్నాయి. ఇక్కడ మోడీ, మరో 25 మంది అభ్యర్థులు పోటీచేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చెత్త సినిమాలు ఎందుకు చేస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు : అనుపమ

బడ్జెట్ రూ.40 కోట్లు.. కలెక్షన్లు రూ.210+ కోట్లు : 'మహవతార్ నరసింహా' ఉగ్రరూపం!!

నా కోసం ప్రభుత్వ వాహనం పంపలేదు... దానికి నాకూ ఎలాంటి సంబంధం లేదు : నిధి అగర్వాల్

ప్రభుత్వ వాహనంలో నిధి అగర్వాల్.. క్లారిటీ ఇచ్చిన హరిహర వీరమల్లు హీరోయిన్

Madhu Shalini : మధు శాలిని ప్రెజెంట్స్ కన్యా కుమారి రిలీజ్ కు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

గౌరవ్ గుప్తా తన బ్రైడల్ కౌచర్ కలెక్షన్, క్వాంటం ఎంటాంగిల్‌మెంట్ ఆవిష్కరణ

తర్వాతి కథనం
Show comments