Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశ వ్యాప్తంగా ఫైనల్ పోలింగ్ ప్రారంభం... కట్టుదిట్టమైన భద్రత

Webdunia
ఆదివారం, 19 మే 2019 (07:45 IST)
సార్వత్రిక ఎన్నికల్లో భాగం తుది దశ పోలింగ్‌లో ఆదివారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పోటీచేస్తున్న వారణాసి సహా దేశంలోని ఏడు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతమైన చండీగఢ్‌లలో విస్తరించిన 59 లోక్‌సభ సీట్లకు పోలింగ్ జరుగుతోంది. ఈ నియోజకవర్గాల్లోని 10,01,75,153ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 
 
ఈ దశలో ఉత్తరప్రదేశ్‌లోని 13 లోక్‌సభ స్థానాలకు, పంజాబ్‌లోని 13, పశ్చిమ బెంగాల్‌లోని 9, మధ్యప్రదేశ్‌లోని 8, బీహార్‌లోని 8, హిమాచల్‌ప్రదేశ్‌లోని 4, జార్ఖండ్‌లోని 3, చండీగఢ్ కేంద్రపాలిత ప్రాంతం లోక్‌సభ స్థానానికి పోలింగ్ జరుగుతోంది. ఈ స్థానాల నుంచి 918 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. 
 
పశ్చిమబెంగాల్‌లో హింసాత్మక ఘటనల నేపథ్యంలో అదనపు బలగాలను మోహరింపజేశారు. ఆదివారం జరిగే పోలింగ్‌తో కలిపితే దేశంలో 542 నియోజకవర్గాలకు పోలింగ్‌ ముగిసినట్లవుతుంది. చివరి దశ పోలింగ్‌ సందర్భంగా దేశంలోని అందరి కళ్లూ వారణాసి నియోజకవర్గంపైనే ఉన్నాయి. ఇక్కడ మోడీ, మరో 25 మంది అభ్యర్థులు పోటీచేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జవాన్‌ చిత్రానికి రాష్ట్రపతి నుంచి జాతీయ అవార్డు తీసుకున్న షారుఖ్ ఖాన్‌

Chittibabu: శోభన్ బాబు ఫ్యాన్ కొంటే ఓనర్ వచ్చి తీయించేశాడు : చిట్టిబాబు

OG: ఉత్తరాంధ్రలో దిల్ రాజు కాంబినేష న్ తో OG విడుదల చేస్తున్న రాజేష్ కల్లెపల్లి

శివరాజ్ కుమార్ కుటుంబంతో ప్రత్యేక సమావేశం అయిన మంచు మనోజ్

Allari Naresh: అల్లరి నరేష్ ఆవిష్కరించిన విద్రోహి ట్రైలర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం టీ తాగితే ఏంటి ప్రయోజనాలు?

భారతీయ రోగులలో ఒక కీలక సమస్యగా రెసిస్టంట్ హైపర్‌టెన్షన్: హైదరాబాద్‌ వైద్య నిపుణులు

శనగలు తింటే శరీరానికి అందే పోషకాలు ఏమిటి?

Navratri Snacks: నవరాత్రి స్నాక్స్.. సగ్గుబియ్యం టిక్కా.. అరటి పండ్ల చిప్స్ సింపుల్‌గా..

కామెర్ల వ్యాధితో రోబో శంకర్ కన్నుమూత, ఈ వ్యాధికి కారణాలు, లక్షణాలేమిటి?

తర్వాతి కథనం
Show comments