Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముగిసిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ : తెలంగాణాలో బీజేపీ - కాంగ్రెస్‌లకు జీరో

Webdunia
ఆదివారం, 19 మే 2019 (18:41 IST)
దేశ వ్యాప్తంగా ఏడు దశల్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ఆదివారం సాయంత్రం ఆరు గంటలతో ముగిసింది. మొత్తం 543 లోక్‌సభ నియోజకవర్గాలకు గాను తమిళనాడు రాష్ట్రంలోని వేలూరు స్థానం మినహా మిగిలిన అన్ని స్థానాలకు ఏడు విడతల్లో ఎన్నికల పోలింగ్ జరిగింది. 
 
తుదివిడతలో 7 రాష్ట్రాల్లోని 59 నియోజకవర్గాల్లో పోలింగ్ నిర్వహించారు. కాగా, ఓ అభ్యర్థికి చెందిన నగదు పెద్ద మొత్తంలో లభించడంతో వేలూరు స్థానం ఎన్నిక రద్దు అయింది. ఈ ఎన్నికను రద్దు చేసినట్లు ఇటీవలే అధికారులు ప్రకటించారు.
 
కాగా, తుది విడత పోలింగ్‌లో సాయంత్రం 6 గంటల వరకు యూపీలో 54.37 శాతం, పంజాబ్‌లో 58.81 శాతం, మధ్యప్రదేశ్‌లో 69.38, బెంగాల్‌లో 73.05, హిమాచల్ ప్రదేశ్‌లో 66.18 పోలింగ్ నమోదైంది. 
 
ఇకపోతే ఆంధ్రా ఆక్టోపస్‌గా పేరుగాంచిన విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ తన సర్వే ఫలితాలను వెల్లడించారు. ముందుగా తెలంగాణ రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాల ఫలితాలను వెల్లడించారు. ఇందులో అధికార తెరాసకు 14 నుంచి 16 ఎంపీ సీట్లు రావొచ్చని వెల్లడించారు. అలాగే, కాంగ్రెస్ పార్టీకి సున్నా లేదా రెండు సీట్లు, బీజేపీకి సున్నా లేదా ఒక్క స్థానం లభిస్తాయని, ఎంఐఎంకు ఒక స్థానం వస్తాయని ప్రకటించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika : రష్మిక మందన్న పాన్ ఇండియా మూవీ మైసా ఫియర్స్ లుక్

Love Jatara: అంకిత్ కొయ్య, మానస చౌదరి జంటగా లవ్ జాతర

కన్నప్ప మూవీ రివ్యూ- కథ మారింది-కల్పితం: నేటి జనరేషన్ నిజం అని నమ్మే ప్రమాదం వుంది!

బిగ్ బాస్ సీజన్ 9- కాంట్రవర్సీలు ఖాయం.. హోస్టుగా నాగార్జునే ఖరారు

మత్తుకు అలవాటుపడిన నటీనటులను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి : దిల్ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments