Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈవీఎంలను మోసుకెళ్లిన గాడిదలు..!

Webdunia
గురువారం, 18 ఏప్రియల్ 2019 (14:08 IST)
భారతదేశం ఎంతో ప్రగతి సాధించింది. అయితే కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ రోడ్డు మార్గాలు సరిగా లేవు. ఫలితంగా అలాంటి ప్రాంతాల్లో రవాణాకు ప్రాచీన పద్ధతినే అవలంభిస్తున్నారు. అదే గాడిదలను వాహనాలుగా ఉపయోగిస్తున్నారు. త‌మిళ‌నాడులోని ధ‌ర్మ‌పురి జిల్లాలోని పెన్న‌గార‌ం నియోజ‌క‌వ‌ర్గంలో జ‌ర‌ుగుతున్న ఎన్నిక‌ల కోసం ఎన్నిక‌ల సంఘం అధికారులు గాడిద‌ల‌ను వాడారు. 
 
కొట్టూరుమలై గ్రామానికి ఈవీఎంల‌ను మోసుకువెళ్లేందుకు నాలుగు గాడిద‌ల‌ను ఈసీ అధికారులు కిరాయి తీసుకున్నారు. హైవేకి సుమారు 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆ గ్రామానికి రోడ్డు లేదు. ఆ ఊరికి వెళ్లడానికి వాహనాలు లేవు. అయితే ఈవీఎంల‌ను మోసుకెళ్లేందుకు గాడిద‌ల‌ను వాడాల్సి వ‌చ్చింది. ఆ ఊరిలో సుమారు 341 ఓట‌ర్లు ఉన్న‌ట్లు తెలుస్తోంది. 
 
ఈవీఎంల‌ను మోసుకెళ్లిన గాడిద‌ల‌కు సినిమా హీరోల పేర్లు పెట్టారు. వీటిని ర‌జ‌నీ, క‌మ‌ల్‌, అజిత్‌, విజ‌య్ అనే పేర్లతో పిలుస్తుంటారు. చిన్న‌స్వామి అనే వ్య‌క్తికి చెందిన గాడిద‌లు ఈవీఎంను మోసుకువెళ్లాయి. 1970 నుంచి ఆ గ్రామానికి గాడిద‌ల ద్వారానే ఎన్నిక‌ల సామాగ్రిని మోసుకువెళ్తున్న‌ట్లు అత‌ను చెప్పాడు. అయితే రోజూ ఒక గాడిద‌కు 2 వేలు రూపాయలు చొప్పున అద్దె చెల్లిస్తారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments